దీపం వెలిగించ‌మంటే.. ప‌టాకులు కాలుస్తారా..! ఏకిపారేసిన సెలబ్రిటీలు

దీపం వెలిగించ‌మంటే.. ప‌టాకులు కాలుస్తారా..! ఏకిపారేసిన సెలబ్రిటీలు
x
Manchu Manoj and Rashmi (File Photo)
Highlights

జబర్దస్త్ యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

జబర్దస్త్ యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూగజీవాల కోసం, సామాజిక సేవలలో కూడా రష్మీ ఎప్పుడు ముందే ఉంటుంది. ఇక ఏప్రిల్ 5 న రాత్రి 9 గంటలకి 9 నిమిషాల పాటు దీపం వెలిగించి భార‌తీయుల ఐక్య‌త చాటారు. అయితే కొందరు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పాలి. దీపాలతో పాటు పటాకులు కాల్చి నానా హంగామా చేశారు. అయితే ఇలాంటి వాళ్ళ పై యాంకర్ రష్మీ ఫైర్ అయ్యారు..

ప్రధాని మనల్ని దీపాలు, క్యాండిల్స్ మాత్రమే వెలిగించమన్నారు. పటాకులు కాల్చమని ఎవరూ చెప్పలేదు. బాణసంచా కాల్చడానికి ఇది దీపావళి పండగ కాదు. భగవంతుడు ఈ ప్రజల్ని నువ్వే మార్చాలంటూ రష్మీ అసహనం వ్యక్తం చేసింది. ఇక తన వంతు బాధ్యతగా ప్రధాని పిలుపు మేరకు రాత్రి 9 గంటల 9 నిమిషాలకు క్యాండిల్ వెలిగించింది.

మంచు మనోజ్ సైతం:

దీపాలతో పాటు భారీ శబ్ధాలతో బాణాసంచా కాల్చిన వారిపై హీరో మంచు మనోజ్ సైతం ఫైర్ అయ్యారు. "రేయ్ ఇడియట్స్.. ఆ క్రాకర్స్ కాల్చడం ఆపండ్రా.. మనం మనుషులే తప్ప మూర్ఖులం కాదు.. క్రాకర్స్ కాల్చమని మిమ్మల్ని ఎవరూ అడగలేదు.. జి బలిసిన చదువుకున్న వాళ్లు మాత్రమే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారు "అంటూ ఫుల్ ఫైర్ అయ్యాడు మ‌నోజ్.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories