స్ఫూర్తికాంతుల తారాదీపాలు

స్ఫూర్తికాంతుల తారాదీపాలు
x
chiranjeevi
Highlights

కష్ట వేళలో ఒకరికొకరం తోడుగా ఉన్నాం. అందరం ఒక్కటే మాట మీద ఉన్నాం. మా దేశ నాయకత్వం మీద మాకు అపార నమ్మకం ఉంది.

కష్ట వేళలో ఒకరికొకరం తోడుగా ఉన్నాం. అందరం ఒక్కటే మాట మీద ఉన్నాం. మా దేశ నాయకత్వం మీద మాకు అపార నమ్మకం ఉంది. మేమందరం కంటికి కనిపించని శత్రువును మా సంఘటిత శక్తితో ఎదుర్కుంటాం. ఈ చిమ్మ చీకట్లో కరోనా మహమ్మారికి మా సమైక్య వెలుగుతో హెచ్చరికను జారీ చేస్తున్నాం అంటూ యుద్ధ భేరి మోగించింది భారతావని. నూరుకోట్లకు పైగా దీపాలు మన దేశాన్ని ప్రపంచానికే వెలుగులు ప్రసాదించే మార్గదర్శిగా చూపించాయి. ప్రధాని మోడీ పిలుపు అందరిలో సమైక్య రాగాన్ని ఆలపించింది అఖండ భారత జనాళి.

ఇక ఈ కార్యక్రమంలో సినీతారాలు పాలుపంచుకున్నారు. తమ నివాసంలో దీపాలను వెలిగించి తమ సంఘీభావాన్ని చాటారు. వీటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో అగ్రహీరోలు చిరంజీవి, రజనీకాంత్‌, వెంకటేష్‌, నాగార్జున, అక్షయ్‌కుమార్‌, రణ్‌వీర్‌సింగ్‌, దీపికాపదుకునే, జాన్వీకపూర్‌ మోహన్‌బాబు, పూజాహెగ్డే, తమన్నా తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని కరోనాపై విజయం సాధించాలనే ధృడసంకల్పాన్ని చాటారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories