చిరంజీవి 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో విజయశాంతి ?

చిరంజీవి లూసిఫర్ తెలుగు రీమేక్ లో విజయశాంతి ?
x
Chiranjeevi, VijayaShanthi (File Photo)
Highlights

గత ఏడాది సైరా సినిమాతో ఆకట్టుకున్న చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే..

గత ఏడాది సైరా సినిమాతో ఆకట్టుకున్న చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ , కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇది చిరంజీవికి 152 వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమా తరవాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. మలయాళంలో మంచి హిట్ అయిన 'లూసిఫర్' సినిమాని చిరంజీవి తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకి సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తునట్లు చిరంజీవి ఇప్పటికే వెల్లడించాడు.

త్వర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ కి సంబంధించిన వ‌ర్క్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు సుజిత్ .. తెలుగు నేటివిటీకి త‌గ్గట్టు మార్పులు చేసే ప‌నిలో ఉన్నాడు సుజీత్. ఇక ఇందులో విజయశాంతి కూడా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒరిజినల్ సినిమాలో మంజు వారియర్ ఓ కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.. అయితే తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో విజయశాంతి అయితే బాగుంటుదని మేకర్స్ భావిస్తున్నట్టుగా సమాచారం.. దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ ఏడాది ఆరంభంలో మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి భారతి అనే కీలకపాత్ర పోషించారు. ఆ పాత్ర ఆమెకి మంచి పేరును తీసుకువచ్చింది. ఆ తర్వాత కథ, పాత్రలు బాగుంటేనే సినిమాలు చేస్తానని విజయశాంతి చెప్పుకొచ్చారు. మరి ఈ 'లూసిఫర్' సినిమాలో ఆమె కోసం అనుకుంటున్న పాత్ర ఆమెను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories