ఎన్టీఆర్ తో మరోసారి శృతిహాసన్.. కాంబో సెట్ చేసిన త్రివిక్రమ్!

ఎన్టీఆర్ తో మరోసారి శృతిహాసన్.. కాంబో సెట్ చేసిన త్రివిక్రమ్!
x
NTR, Shruthi Hassan (File Photo)
Highlights

అల వైకుంఠపురములో సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అల వైకుంఠపురములో సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఇప్పటికే దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ గా మిగిలి ఉంది. ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్స్ ఎవరు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ కు స్కోప్ ఉండడంతో మొదటి హీరోయిన్ గా పూజా హెగ్డే, రష్మిక మందన, జాన్వీ కపూర్, కియారా అద్వానీ మొదలగు పేర్లు వినిపించాయి.

అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి మరో హీరోయిన్ కూడా చేరిపోయింది..విషయమై బాగా ఆలోచించిన త్రివిక్రమ్ చివరకు శృతి హాసన్‌ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ శ్రుతి హసన్ కలిసి రామయ్య వస్తావయ్యా సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.. అయితే ఇదే జోడీని ఈ సారి సరికొత్తగా వెండితెరపై ఆవిష్కృతం చేయాలని ప్లాన్ చేశారట త్రివిక్రమ్. ఇప్పటికే ఆమెతో చర్చలు సంప్రదించారని త్వరలో దీనిపైన అఫీషియల్ అనౌన్స్ మెంట్రా నుందనీ తెలుస్తుంది..

గతంలో ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అరవింద సమేత' ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేయనున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR అనే చిత్రంలో నటిస్తున్నాడు..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories