కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తుంది. ఇప్పటికే 195 దేశాలకు పైగా వ్యాపించి విలయ తాండవం చేస్తోంది.
కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తుంది. ఇప్పటికే 195 దేశాలకు పైగా వ్యాపించి విలయ తాండవం చేస్తోంది. ప్రభుత్వం కూడా కరోనాని తరిమికొట్టేందుకు కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది. ఇక ప్రభుత్వానికి సహాయం చేసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు.
ఇక ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సతీమణి అనుపమ రూ. 2 కోట్లు, టాలీవుడ్ హీరో నితిన్ ఏపీ, తెలంగాణకు రూ.10 లక్షల రూపాలయ చొప్పున విరాళాలును అందజేశారు. తాజాగా హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి 50 లక్షల రూపాయల చొప్పున కోటి రూపాయలను, ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. కోటి రూపాయలను అందజేస్తున్నట్లు ప్రకటించారు. రామ్ చరణ్ 70 లక్షలు అందజేశారు.
ఇక తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి తనవంతుగా కోటిరూపాయల విరాళాన్ని ప్రకటించారు.. తాను పూర్తిగా హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని, ప్రజలు కూడా ఇంటిదగ్గరే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని ప్రభాస్ కోరారు..
ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది. ప్రపంచంలో ఇప్పటికే 20 వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక భారత్లో 630 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
Darling #Prabhas announces a contribution of Rs 1 Crore to the CM relief funds of Telangana and Andhra Pradesh. #StayHomeStaySafe #IndiaFightsCoronavirus
— Prabhas (@PrabhasRaju) March 26, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire