కోమాలో ప్రముఖ నటుడు.... దిగ్బ్రాంతి లో తెలుగు చిత్ర పరిశ్రమ

కోమాలో ప్రముఖ నటుడు.... దిగ్బ్రాంతి లో తెలుగు చిత్ర పరిశ్రమ
x
Narsing Yadav (File Photo)
Highlights

నటుడు నర్సింగ్ యాదవ్ కోమాలోకి వెళ్లారు.. ఈ విషయాన్నీ ఆమె భార్య చిత్ర యాదవ్ వెల్లడించారు.

నటుడు నర్సింగ్ యాదవ్ కోమాలోకి వెళ్లారు.. ఈ విషయాన్నీ ఆమె భార్య చిత్ర యాదవ్ వెల్లడించారు. సాయంత్రం 4 గంటలు సమయంలో నర్సింగ్ యాదవ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడని, ప్రస్తుతం అతన్ని హైదరాబాదులోని సోమజిగూడా యశోద ఆస్పత్రికి తరలించామని అన్నారు. అంతేకాకుండా ఈరోజు ఉదయం కూడా డయాలసిస్ చేయించామని ఆమె వెల్లడించారు.

నర్సింగ్ యాదవ్ అనుకోకుండా కోమాలోకి వెళ్ళాడని, 48 గంటలు పాటు అబ్జర్ వేశాన్ లో ఉంచినట్టుగా ఆమె వెల్లడించారు. ప్రస్తుతం అతనికి వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇక నర్సింగ్ యాదవ్ ఇంట్లో కింద పడిపోయాడని, తలకి గాయం అయ్యింది అని వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. సోషియల్ మీడియా లో వస్తున్న వార్తలు ఎవరు నమ్మకండి అంటూ విజ్ఞప్తి చేశారు. తను ఎక్కడ పడిపోలేదని, ఉన్నట్లు ఉండి కోమాలోకి వెళ్ళిపోయాడని ఆమె అన్నారు. త్వరగా కోలుకొని తను ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నామని ఆమె అన్నారు.

ఇక నర్సింగ్ యాదవ్ తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి సుమారు 300 చిత్రాలకు పైగా నటించాడు. విజయనిర్మల దర్శక నిర్మాతగా వచ్చిన హేమాహేమీలు చిత్రంతో వెండితెరకి పరిచయం అయ్యారు. ఇక దర్శకుడు రాం గోపాల్ వర్మ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవి నటించిన ఎక్కువ సినిమాలలో నర్సింగ్ యాదవ్ నటించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories