దేవిని పక్కన పెడుతున్న దర్శకులు..

దేవిని పక్కన పెడుతున్న దర్శకులు..
x
Highlights

దేవి శ్రీ ప్రసాద్ .. టాలీవుడ్ లో ఓ సంచలనం అనే చెప్పాలి. చిన్న వయసులో సంగీత దర్శకుడు అయ్యాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో...

దేవి శ్రీ ప్రసాద్ .. టాలీవుడ్ లో ఓ సంచలనం అనే చెప్పాలి. చిన్న వయసులో సంగీత దర్శకుడు అయ్యాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే తానంటే ఏంటో నిరూపించుకున్నాడు. కీరవాణి, మణిశర్మ లాంటి సంగీత దర్షకులు మంచి ఫాంలో ఉండగానే ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడ్డాడు దేవి.. ఆ తర్వాత వచ్చిన సంగీత దర్శకులతో పోటిగా పాటలు అందించాడు. దీనితో దేవి కొంతమంది దర్శకులుకు ఆస్థాన సంగీత దర్శకుడు అయిపోయాడు.

ఒకప్పుడు దేవిని ఆస్థాన సంగీత దర్శకుడిగా ఎంచుకున్న దర్శకులు ఇప్పుడు మాత్రం పక్కన పెడుతున్నారు. జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలతో గుడ్ కాంబినేషన్ అని ముద్ర పడిపోయిన దేవి, త్రివిక్రమ్ ఆ తరవాత సినిమాలు చేయడం మానేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమాకి కూడా త్రివిక్రమ్ దేవిని పక్కన పెట్టి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ ని ఎంచుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి కూడా తమన్ ని ఎంచుకున్నాడు.

ఇక కొరటాల కూడా ఇదే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కొరటాల చిరంజీవితో 152వ సినిమా చేస్తున్నాడు. విజయదశమి సందర్బంగా సినిమా పూజ కార్యక్రమాలని నిర్వహించారు. అయితే ఇందులో దేవి పేరును ప్రకటించలేదు. సైరా సినిమాకి సంగీత దర్శకుడుగా పనిచేసిన అమిత్ త్రివేదిని ఈ సినిమాకి కూడా పెట్టుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుందని తెలుస్తుంది. గతంలో వీరి కాంబినేషన్ లో మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్ ,భరత్ అను నేను సినిమాలు వచ్చి మంచి హిట్టయ్యాయి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories