'ఆజా మేరే ఘర్' అంటున్న తమన్నా?

ఆజా మేరే ఘర్ అంటున్న తమన్నా?
x
తమన్నా
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'..రష్మిక మందన్నా కథానాయకగా నటిస్తుంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'..రష్మిక మందన్నా కథానాయకగా నటిస్తుంది. సంక్రాంతి పండగ కానుకగా సినిమాని జనవరి 11 న విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషన్స్ ని సరికొత్తగా మొదలు పెట్టింది. ప్రతి సోమవారం సినిమాకి సంబంధించిన ఎదో ఒక అప్డేట్ రిలీజ్ చేస్తుంది చిత్రబృందం..

అయితే ఈ సినిమాలో రెండు ఐటెం సాంగ్స్ ఉన్నాయట. ఒకటి రాయలసీమ నేపథ్యంలో వచ్చే మైండ్ బ్లాక్ సాంగ్ కాగా మరొకటి కాశ్మీర్ నేపథ్యంలో వస్తుందట. ఇందులో కాశ్మీర్ నేపథ్యంలో వచ్చే ఐటెం సాంగ్ లో తమన్నా కనిపించనుందని టాక్.. ఈ పాట సాహిత్యం ముందుగా "ఆజా మేరే ఘర్ మే పార్టీ హై తూ ఆజా మేరి రాజా" అంటూ హిందీ పదాలతో మొదలు అవుతుందట.. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారని తెలుస్తోంది.

మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత మహేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు తగట్టుగానే టీజర్, పోస్టర్స్ కూడా ఉన్నాయి. ఇందులో మహేష్ ఆర్మీ లుక్ లో కనిపిస్తున్నాడు, విజయశాంతి, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories