లేడి మల్టీస్టారర్‌గా సురేష్ ప్రొడక్షన్స్ కొత్త సినిమా

లేడి మల్టీస్టారర్‌గా సురేష్ ప్రొడక్షన్స్ కొత్త సినిమా
x
Highlights

విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించడంలో సురేష్ ప్రొడక్షన్స్ ఎప్పుడు ముందు ఉంటుంది. గత ఏడాది ఓ బేబి అంటూ ఓ కొరియన్ మూవీని తెలుగులో రీమెక్ చేసి అందరి...

విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించడంలో సురేష్ ప్రొడక్షన్స్ ఎప్పుడు ముందు ఉంటుంది. గత ఏడాది ఓ బేబి అంటూ ఓ కొరియన్ మూవీని తెలుగులో రీమెక్ చేసి అందరి ప్రశంసలు పొందింది ఈ చిత్రం.. ఇప్పుడు అదే తరహలో మరో కొరియన్ మూవీని తెలుగులో రీమేక్ చేసే పనిలో ఉంది.

మిడ్‌ నైట్‌ రన్నర్స్‌ అని కొరియన్ భాషలో 2017లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అక్కడ పోలీసుల ట్రైనింగ్‌లో ఉన్న ఇద్దరు యువకుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. కథ పరంగా ఆ పోలీస్ ట్రైనింగ్‌లో ఉన్న ఇద్దరు యువకులు అత్యుత్సాహంతో ఓ కిడ్నాప్ కేసును సాధించడానికి ప్రయత్నించి చిక్కుల్లో పడతారు. ఆ చిక్కు నుంచి వారు ఎలా బయటపడ్డారు? ఆ కిడ్నాప్ కేసును ఎలా సాధించారు అన్నది మిగిలిన కథ..

అయితే ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు సురేష్ ప్రొడక్షన్ సిద్దం అయింది. కాకపోతే అక్కడ ఇద్దరు హీరోలతో తెరకెక్కిన ఈ సినిమాని ఇక్కడ ఇద్దరు హీరోయిన్స్ తో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట! ఆ ఇద్దరు పాత్రలకోసం హీరోయిన్స్ రేజీనా, నివేదా థామస్‌ల పేర్లను అనుకుంటున్నారట!.. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ర్ వర్క్ కూడా మొదలైందిని దీనికి దర్శకుడిగా సుధీర్‌ వర్మని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది.

స్వామిరారా, కేశవ, రణరంగం లాంటి థ్రిల్లర్ కాన్సెప్ట్స్ ని తెరకెక్కించిన సుదీర్ వర్మ ఈ సినిమాకి బాగా సూట్ అవుతాడని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి..

ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగు అసురన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ ప్రధానపాత్రలో నటిస్తుండగా, ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories