పరుశురాం తోనే మహేష్ మూవీ ఫిక్స్

పరుశురాం తోనే మహేష్ మూవీ ఫిక్స్
x
Mahesh Babu (File Photo)
Highlights

ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 27వ సినిమాని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తారని వెల్లడించారు.

ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన 27వ సినిమాని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తారని వెల్లడించారు. మహర్షి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. కానీ స్క్రిప్ట్ విషయంలో వంశీతో బేధాభిప్రాయాలు రావడంతో మహేష్ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు.

వంశీతో సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకుడు పరశురామ్ తో 14 రీల్స్ బ్యానర్ పై తన తదుపరి సినిమాను చేయవలసి వుంది. దీనితో ఇదే ప్రాజెక్ట్ ని ముందుగా పట్టలెక్కించెందుకు మహేష్ ముహూర్తం ఫిక్స్ చేశారు. మహేశ్ బాబు - పరశురామ్ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

నాగచైతన్య సినిమా ఆలస్యం :

దీనికి ముందు దర్శకుడు పరుశురాం, హీరో నాగచైతన్యతో ఓ సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నాగచైతన్యకి ఇది 20వ చిత్రం.. ఈ సినిమాకి నాగేశ్వరరావు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇప్పుడు మహేష్ సినిమా ఫిక్స్ కావడంతో ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories