సుకుమార్ కథతో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటించనున్నాడు, కరెంట్, కుమారి 21 f లాంటి సినిమాలకి
సినిమా సినిమాకి సంబంధం లేకుండా సినిమాలని చేయడం దర్శకుడు సుకుమార్ స్టైల్.. సినిమాలకి దర్శకత్వం వహించడం మాత్రమే కాదు. తానే నిర్మాతగా కుమారి 21 f అనే సినిమాని నిర్మించాడు సుకుమార్.. ఈ సినిమాకి కథను కూడా అందించాడు.. అయితే ఇప్పుడు అదే తరహాలో మరో సినిమాని చేయబోతున్నాడు సుకుమార్ .. సుకుమార్ కథతో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటించనున్నాడు, కరెంట్, కుమారి 21 f లాంటి సినిమాలకి దర్శకత్వం వహించిన పల్నాటి సుర్యప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాని సుకుమార్ తో పాటు గీతా ఆర్ట్స్ పై బన్ని వాసు కలిసి సినిమాని నిర్మించనున్నారు. లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో పట్టాలేక్కనుంది.
ఇక సుకుమార్ ఈ సినిమా చేస్తూనే అల్లు అర్జున్ తో కలిసి మరో సినిమాని చేయనున్నారు. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది, మైత్రి మూవీ మేకర్స్ సినిమాని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాదిలో సినిమాని విడుదల చేయనున్నారు.
ఇక హీరో నిఖిల్ తాజాగా అర్జున్ సురవరం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా మెసేజ్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నిఖిల్ కి జోడిగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది.
After #ArjunSuravaram's blockbuster success, here comes Mega announcement! Super Congrats @actor_Nikhil bro! You're rocking! Big names behind this project. Hope this film is going to stand out in your career. #Nikhil #Sukumar #alluaravind @GeethaArts @dirsuryapratap @SKNonline pic.twitter.com/aVRr4nRNEb
— Sandeep Athreya (@SandeepSpeakz) December 3, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire