Shweta Pandit: ఇటలీలో చిక్కుకున్న టాలీవుడ్ సింగర్

Shweta Pandit: ఇటలీలో చిక్కుకున్న టాలీవుడ్ సింగర్
x
shweta pandit(File Photo)
Highlights

కరోనా వైరస్ ... ఇప్పుడు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. చైనాలో మొదలైన ఈ మహమ్మారి వ్యాధి 195 దేశాలకి పైకి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.

కరోనా వైరస్ ... ఇప్పుడు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. చైనాలో మొదలైన ఈ మహమ్మారి వ్యాధి 195 దేశాలకి పైకి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది.. ఇక ఈ వ్యాధి చైనాలో మొదలై తగ్గుముఖం పడుతున్నప్పటికి ఇటలీలో మాత్రం విజృంభిస్తుంది. రోజుకు వేల సంఖ్యలో మంది ఇక్కడ మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సింగర్ శ్వేతా పండిట్ ఇటలీలో చిక్కుకుంది. తాజాగా తాను ఇటలీ లో ఉన్నట్లు ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మొదలగు సినిమాలలో పాటలు పాడిన శ్వేతా పండిట్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అయితే తాజాగా ఇటలీలో చిక్కుకున్న ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ..." అందరూ కరోనా వైరస్ గురించి వినే ఉంటారు.. ప్రస్తుతం ఈ వైరస్ భయాందోళనలను సృష్టిస్తోంది.. దీనిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది అని తెలుసుకున్నాను.. ప్రజలు ప్రభుత్వం చెబుతున్న నియమాలను, ప్రమాణాలను పాటించండి. ప్రయాణాలు చేయడం మానేసి ఇంట్లోనే ఉండండి..

ఇక ఇప్పటికే ఇటీలిలో ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయాయి..నేను ఉదయం లేవగానే తాను ముందుగా వినేది అంబులెన్స్ సౌండే అని శ్వేతా తెలిపింది. ప్రస్తుతానికి తాను ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉన్నట్లు శ్వేతా వెల్లడించింది.. ఇక నాకు భారత్‌కు రావాలని ఉన్నప్పటికీ రాలేను అని , నా ద్వారా ఆ వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించడం నాకు ఇష్టం లేదు అంటూ శ్వేతా పేర్కొంది. ఆమె అక్కడ సురక్షితంగా ఉండాలని కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తుంది.ఇప్పటికే ప్రపంచంలో ఇప్పటికే 20 వేల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక భారత్లో 630 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories