రేణుమండల్ క్యా లైఫ్ జర్నీ హై : రైల్వే ప్లాట్ ఫామ్ టు బాలీవుడ్ సింగర్

రేణుమండల్ క్యా లైఫ్ జర్నీ హై : రైల్వే ప్లాట్ ఫామ్ టు బాలీవుడ్ సింగర్
x
Highlights

పాట పాడినందుకు గాను ఆమెకి అక్షరాల ఏడూ లక్షల రూపాయలు ఇచ్చాడట ..! కానీ ముందు దీనికి నిరాకరించిన రేణుమండల్ తర్వాత హిమేష్ రెష్మియా బలవంతం మీదా తీసుకుందట ...

లైఫ్ అనేది ఓ చేజింగ్ గేమ్ లాంటిది .. ఎప్పుడు, ఎక్కడ,ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ అర్ధం కాదు . రేణుమండల్ జీవితంలో కూడా అలాగే జరిగింది . తన పొట్టకోసం పచ్చిమ బెంగాల్ లోని ఓ రైల్వే ప్లాట్ ఫామ్ పై పాటలు పాడిన ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో పాటలు పాడే రేంజ్ కి ఎదిగింది. రైల్వే ప్లాట్ ఫామ్ పై పాటలు పాడుతుండగా ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రాత్రికి రాత్రే ఆమె స్టార్ అయిపొయింది . దీనితో సోని ఛానల్ ఆమెను పిలిపించి మరి పాట పాడించారు. ఆమె పాటకు ఆకర్షితుడు అయిన బాలీవుడ్ నటుడు, గాయకుడు హిమేష్ రెష్మియా తన తదుపరి సినిమా 'హ్యాపీ హార్డీ అండ్‌ హీర్‌' సినిమాలో ఆమెకు పాట పాడే అవకాశం ఇచ్చాడు.

ఈ క్రమంలో రేణుమండల్ పాట పాడుతున్న 'తేరీ మేరీ కహానీ' అనే వీడియోను ఆమె అద్భుతంగా ఆలపించారని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అయితే ఈ పాట తర్వాత ఆమెకు బాలీవుడ్ సినిమాలకు చాలా ఆఫర్స్ వస్తున్నాయని బాలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది . హిమేష్ రెష్మియా కొత్త సినిమాలో పాట పాడినందుకు గాను ఆమెకి అక్షరాల ఏడూ లక్షల రూపాయలు ఇచ్చాడట ..! కానీ ముందు దీనికి నిరాకరించిన రేణుమండల్ తర్వాత హిమేష్ రెష్మియా బలవంతం మీదా తీసుకుందట ... రైల్వే ప్లాట్ ఫామ్ పై బిచ్చగత్తె నుండి ఇప్పుడు బాలీవుడ్ సింగర్ గా ఎదిగినా రేణుమండల్ కి ఇప్పుడు అన్ని వచ్చాయి . ఏడేళ్ళ కింద అంధవికారంగా ఉందని వదిలేసినా తన కూతురు కూడా తన దగ్గరికి చేరడం ఇక్కడ కొసమెరుపు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories