'శ్రీకారం' చుట్టిన శర్వానంద్

శ్రీకారం చుట్టిన శర్వానంద్
x
Highlights

విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు హీరో శర్వానంద్.

విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు హీరో శర్వానంద్.. అందులో భాగంగానే ప్రస్థానం, గమ్యం, శతమానం భవతి లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం జాను సినిమాలో బిజీగా ఉన్నాడు శర్వానంద్ . ఈ సినిమాతో పాటు మరో సినిమాని కూడా లైన్ లో పెట్టాడు శర్వానంద్ అదే 'శ్రీకారం' ..

ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. శర్వా లుంగీ కట్టుకుని, కండువా వేసుకుని పొలంలో నడుస్తున్నట్లు కనిపించారు. చూస్తుంటే ఇది పక్కా పల్లెటూరు ఫ్యామిలీ మూవీగా తెరకేక్కుతునట్టుగా కనిపిస్తుంది. ఇందులో శర్వానంద్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. కిశోర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, మిక్కీ జే మేయర్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.

ఇక జాను సినిమా విషయానికి వచ్చేసరికి తమిళ్ లో మంచి హిట్టు అయిన 96 సినిమాని తెలుగులో 'జాను' అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది. దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఫిబ్రవరి 7 న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ సినిమాపైన మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. గోపిసుందర్ సంగీతం అందిచాడు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories