స్టేజ్‌పై బోరున ఏడ్చేసిన లవ్లీ హీరోయిన్

స్టేజ్‌పై బోరున ఏడ్చేసిన లవ్లీ హీరోయిన్
x
స్టేజ్‌పై బోరున ఏడ్చేసిన లవ్లీ హీరోయిన్
Highlights

నటుడు సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా నటంచిన లవ్లీ సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది హీరోయిన్ శాన్వీ .. ఆ తర్వాత అడ్డా, రౌడి...

నటుడు సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా నటంచిన లవ్లీ సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది హీరోయిన్ శాన్వీ .. ఆ తర్వాత అడ్డా, రౌడి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆమెకి రావల్సినంత గుర్తింపు అయితే రాలేదు. ఆ తర్వాత సినిమా అవకాశాలు లేకుండా పోయాయి. ఏడాదిన్నర కాలం పాటు ఖాళీగానే ఉంది ఈ భామ..

తాజాగా కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా తెరకేక్కిన 'అవనే శ్రీమన్నారయణ'సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇదే సినిమాని తెలుగులో 'అతడే శ్రీమన్నారాయణ' టైటిల్‌తో విడుదల చేస్తున్నారు.. సచిన్ రవి డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 27న ఈ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా బుధవారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా హీరోయిన్ శాన్వి మాట్లాడుతూ స్టేజ్‌పై ఏడ్చేశారు.

నాకు 'రౌడీ' సినిమా తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. నా కాన్ఫిడెన్స్ మీదా నాకు నమ్మకం పోయింది. నాది చాలా చిన్న వయసనో, లేక సరిగ్గా నటించననో, లేక అందంగా లేననో తెలియదు కానీ దాదాపు ఏడాదిన్నర పాటు చేతిలో సినిమాలు లేకుండా కూర్చున్నా. ఎన్నో రాత్రిళ్లు కుమిలిపోయా. ఎక్కడ తప్పు జరిగిందో తెలీక ఏడ్చాను. కానీ నాకు 'అతడే శ్రీమన్నారాయణ' ద్వారా తెలుగు ప్రేక్షకులను మళ్లీ పలకరించే అవకాశం వచ్చింది. కనీసం ఈ సినిమా ద్వారానైనా తెలుగు వారు నాలోని టాలెంట్‌ను గుర్తించి నాకు అవకాశాలు ఇస్తారని ఎదురుచూస్తున్నా'' అంటూ కన్నీరుపెట్టుకున్నారు శాన్వి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories