బాలయ్య బాబుతో ఇంకా చాలా సినిమాలు చేయాలి..స్టేజీ పైనే కన్నీళ్ళు పెట్టుకున్న సీనియర్ నటి

బాలయ్య బాబుతో ఇంకా చాలా సినిమాలు చేయాలి..స్టేజీ పైనే కన్నీళ్ళు పెట్టుకున్న సీనియర్ నటి
x
బాలకృష్ణ, దేవిశ్రీ
Highlights

నటసింహం బాల‌కృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రూలర్.. కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహించారు.

నటసింహం బాల‌కృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రూలర్.. కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. భూమిక, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాని సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాని డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

సినిమాకి మంచి టాక్ రావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది. అయితే ఈ సందర్బంగా సీనియర్ నటి దేవీశ్రీ మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ఆమెను యాంకర్ గీత ఓదార్చారు అనతరం ఆమె మాట్లాడుతూ.. " ' నా కెరీర్‌లో నేను చాలా సినిమాలు చేశాను. కానీ, బ్రేక్ వచ్చే క్యారెక్టర్ ఏదీ దక్కలేదు. కానీ సడన్ గా బాలయ్య బాబు సినిమాలో అయన మదర్ క్యారెక్టర్ అని నాకు ఫోన్ రాగానే నేను షాక్ అయ్యాను. ఎందుకంటే, ఆ పాత్ర నాకు దక్కడం నిజంగా నేను చాలా లక్కి అని అంటూ దేవీశ్రీ కంటతడి పెట్టుకున్నారు.

బాలయ్య బాబుతో మరిన్ని సినిమాలు చేయాలనీ అనుకుంటున్నాననీ తెలిపారు. ఇక మూవీ షూటింగ్ జరిగినన్ని రోజులూ ఆయనతో ఏదైనా ఒక్క సెంటిమెంట్ సీన్ పడితే బాగుండు అని ఎదురుచూసేదాన్ని. చేయాలని బాగా కోరిక ఉండేది. కానీ ఆ అవకాశం రాలేదని , మళ్లీ మళ్లీ ఆయన మూవీస్‌లో చేయాలని నేను కోరుకుంటున్నానని "చెప్పారు దేవిశ్రీ

జై సింహ తర్వాత బాలకృష్ణ, కేయస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కావడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా బాగుండడంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతం అందించాడు.

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాని మొదలుపెట్టాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో పట్టాలేక్కనుంది. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories