మహర్షి సినిమాతో ఈ సంవత్సరం మంచి సక్సెస్ ని అందుకున్నాడు హీరో మహేష్ బాబు. అ తర్వాత అనిల్ రావిపుడి దర్శకత్వంలో సరిలేరు నీకేవ్వరు అనే సినిమాని...
మహర్షి సినిమాతో ఈ సంవత్సరం మంచి సక్సెస్ ని అందుకున్నాడు హీరో మహేష్ బాబు. అ తర్వాత అనిల్ రావిపుడి దర్శకత్వంలో సరిలేరు నీకేవ్వరు అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో మహేష్ అర్మీ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలిజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీటైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు గుమ్మడి కాయ కొట్టేసారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా ద్వారా వేల్లడించారు. జూలై 5న మొదలైన మా ప్రయాణం.. డిసెంబర్ 18తో షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీటైంది. అంటూ పోస్ట్ పేట్టాడు.
ఈ సంక్రాంతి సినీ అభిమానులకు, ప్రేక్షకులుకు ఫ్యాన్స్కు మరిచిపోలేని సంక్రాంతి అవుతుందంటూ చేప్పకోచ్చాడు. రష్మీక మందన్నా హీరోయిన్ గా నటస్తుంది. రావు రమేష్, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత, విజయశాంతి ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమాని జనవరి 11 న విడుదల చేయనున్నారు.
Started a memorable journey on July 5th And wrapped #SarileruNeekevvaru Shoot today, Dec 18th!!
— Anil Ravipudi (@AnilRavipudi) December 18, 2019
This Sankranti will be as memorable one for all the movie lovers & Fans ♥
January 11th 2020 🤟#SuperStarSankranthi pic.twitter.com/9PGqO7DsKM
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire