'సరిలేరు' కి గుమ్మడికాయ కొట్టేసిన చిత్రబృందం

సరిలేరు కి గుమ్మడికాయ కొట్టేసిన చిత్రబృందం
x
sarileru neekevvaru
Highlights

మహర్షి సినిమాతో ఈ సంవత్సరం మంచి సక్సెస్ ని అందుకున్నాడు హీరో మహేష్ బాబు. అ తర్వాత అనిల్ రావిపుడి దర్శకత్వంలో సరిలేరు నీకేవ్వరు అనే సినిమాని...

మహర్షి సినిమాతో ఈ సంవత్సరం మంచి సక్సెస్ ని అందుకున్నాడు హీరో మహేష్ బాబు. అ తర్వాత అనిల్ రావిపుడి దర్శకత్వంలో సరిలేరు నీకేవ్వరు అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో మహేష్ అర్మీ రోల్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలిజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీటైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు గుమ్మడి కాయ కొట్టేసారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా ద్వారా వేల్లడించారు. జూలై 5న మొదలైన మా ప్రయాణం.. డిసెంబర్ 18తో షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీటైంది. అంటూ పోస్ట్ పేట్టాడు.

ఈ సంక్రాంతి సినీ అభిమానులకు, ప్రేక్షకులుకు ఫ్యాన్స్‌కు మరిచిపోలేని సంక్రాంతి అవుతుందంటూ చేప్పకోచ్చాడు. రష్మీక మందన్నా హీరోయిన్ గా నటస్తుంది. రావు రమేష్, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత, విజయశాంతి ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమాని జనవరి 11 న విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories