సరిలేరు నీకెవ్వరు సెన్సార్ పూర్తి.. సినిమాకి అవే మైనస్

సరిలేరు నీకెవ్వరు సెన్సార్ పూర్తి.. సినిమాకి అవే మైనస్
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం "సరిలేరు నీకెవ్వరు" ..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం "సరిలేరు నీకెవ్వరు" .. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ పూర్తైపోయింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలని తెలుస్తోంది. ఇక బిజినెస్ మెన్ సినిమా తర్వాత మహేష్ కెరియర్ లో అతి తక్కువ రోజుల్లో కంప్లీట్ చేసిన సినిమా ఇదే కావడం విషయం..

జూన్ 1న ప్రారంభమైన ఈ చిత్రం డిసెంబర్ 18న షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. ఇక అంతే త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు. సినిమా బాగా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని, ఆర్మీ రోల్ లో మహేష్ నటన బాగుందని అంటున్నారు. ఈ సంక్రాంతికి మహేష్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు కొట్టడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి సినిమాకి అంతా పాజిటివ్‌ టాకే వస్తుంది. కానీ రొటీన్ యాక్షన్ డ్రామా కావడం, నిడివి కూడా పెద్దగా ఉండడం సినిమాకి మైనస్ లు గా చెబుతున్నారు.

అయితే అనిల్ రావిపూడి మాత్రం ఎఫ్ 2 కూడా ఇంతే నిడివి ఉందని, ఆందోళన చెందవద్దని, సక్సెస్ పైన పక్కా కాన్ఫిడెంట్ ఉన్నాడట! ఇక ఈ సినిమాలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ సినిమాకి బిగ్గెస్ట్ హైలెట్ కానుందట. ఏకంగా 39 నిముషాలు ఈ ఎపిసోడ్ సాగానుందట.. ఇందులోని రష్మిక ఫ్యామిలీ మొత్తం మహేష్ ని అల్లుడు చేసుకోవాలని అనుకునే నేపధ్యంలో వచ్చే సీన్ హైలెట్ కానుందట ! ఇక ఇదే సీన్ లో జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఉండనున్నారట ! ఇక ఇందులో యాక్టర్ కం ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఓ దొంగ క్యారెక్టర్ లో వచ్చి కడుపుబ్బా నవ్వించనున్నాడట..విజయశాంతి, మహేష్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నయట..

ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకరలతో పాటు మహేష్ నిర్మించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. సంక్రాతి కానుకగా ఈ సినిమాని జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories