మూసలోంచి బయటికి వచ్చిన మెగా మేనల్లుడు

మూసలోంచి బయటికి వచ్చిన మెగా మేనల్లుడు
x
Highlights

రొటీన్ సినిమాలు చేస్తూ అరడజన్ ప్లాపులను సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఆ తర్వాత తన పేరును, కథలను మార్చుకొని సినిమాలను చేయడం మొదలు పెట్టాడు.

రొటీన్ సినిమాలు చేస్తూ అరడజన్ ప్లాపులను సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. ఆ తర్వాత తన పేరును, కథలను మార్చుకొని సినిమాలను చేయడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్ర లహరి అనే సినిమాని చేశాడు, కథ కూడా సాయి తేజ్ కి సరిగా అప్ట్ అవ్వడం కథనంలో కొత్తదనం కనిపించడంతో ప్రేక్షకులు సినిమాని హిట్ మెట్టుని ఎక్కించారు.

ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో ప్రతి రోజూ పండగే అంటూ కుటుంబ కథ చిత్రాన్ని చేశాడు. ప్రస్తుత సమాజంలో ప్రతి కుటుంబంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండడం, మారుతి మార్క్ ఉండడంతో సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా 35 కోట్లు షేర్ వసూళ్ళు చేసి సాయి తేజ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డులు సృష్టించింది. ఈ సినిమా ఇంత విజయం సాధించడంతో చిత్ర నిర్మాతల్లో ఒకరైనా యువీ క్రియేషన్స్ మారుతికి కారును బహుమతిగా ఇచ్చారు.

ఇక ఈ సినిమా తర్వాత యూత్ ని టార్గెట్ చేస్తూ సోలో బ్రతుకే సో బెటర్ అంటూ మరో సినిమాని చేస్తున్నాడు. అమ్మాయిలంటే ఇష్టం ఉన్నప్పటికీ పెళ్లికి నో చెప్పే కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే నూతన దర్శకుడు వెండితెరకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాని మే 01 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రిలీజ్ చేసింది.

ఇక ఈ సినిమా తరవాత దేవాకట్టా దర్శకత్వంలో పవర్ ఫుల్ ఎమోషనల్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని కూడా ఇదే సంవత్సరం విడుదల చేయనున్నారు. ఇక దేవాకట్టా సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ కొత్తరకం పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నాడని వినికిడి. మొత్తానికి సినిమా సినిమాకి కథలో వేరియేషన్స్ చూపిస్తూ తనని తానూ ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు సాయి తేజ్


Show Full Article
Print Article
More On
Next Story
More Stories