నిఖిల్ గౌడ పెళ్లిపై బాలీవుడ్ నటి సంచలన వాఖ్యలు

నిఖిల్ గౌడ పెళ్లిపై బాలీవుడ్ నటి సంచలన వాఖ్యలు
x
kannada hero Nikhil gouda wedding
Highlights

ఒకపక్కా కరోనాతో దేశామంతటా అల్లకల్లోలం అవుతుంటే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కన్నడ హీరో నిఖిల్ వివాహం ఈ రోజు ఘ‌నంగా జరిగింది.

ఒకపక్కా కరోనాతో దేశామంతటా అల్లకల్లోలం అవుతుంటే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కన్నడ హీరో నిఖిల్ వివాహం ఈ రోజు ఘ‌నంగా జరిగింది. ఉదయం బెంగ‌ళూరు స‌మీపంలోని రామ‌న‌గ‌ర్ ఫాం హౌజ్‌లో నిఖిల్, రేవతిల వివాహం అతికొద్ది సమక్షంలో ఒక్కటయ్యారు. అయితే ఈ వివాహ వేడుకలో ఎవరు కూడా మాస్క్ లు ధరించకపోవడం, సామజీక దూరం పాటించకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దీనిపైన కర్ణాటక ప్రభుత్వంతో పాటు బీజీపీ నాయకులూ త‌ప్పు ప‌ట్టారు.

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ నిఖిల్ గౌడ వివాహం పైన స్పందించింది.. పేద‌ల క‌డుపులు కాలుతున్న ఈ ప‌రిస్థితుల‌లో పెళ్ళి ఘ‌నంగా చేసుకోవ‌డాన్ని ఆమె తప్పుపట్టింది. క‌రోనా సంక్షోభంలో వ‌ల‌స కూలీలు తమ ఇంటికి చేరుకోలేక క‌డుపులు మాడ్చుకుంటున్నారు. వీరిని ఆదుకునేందుకు సామాజిక స్పృహ ఉన్న కొంద‌రు నిత్యావ‌స‌ర స‌రుకులు అందిస్తున్నారు. ధ‌నికులు మాత్రం నిబంధ‌న‌ని ఉల్లంఘిస్తున్నారు. పేద‌ల క‌ష్టాలు వారికి అర్ధం కావ‌డం లేదు అంటూ విమర్శలు చేశారు. అస‌లు పెళ్లిలో ఎలాంటి వంట‌కాలు వ‌డ్డించారో అంటూ నిప్పులు చెరిగింది ర‌వీనా...

ఇక దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,007 కేసులు నమోదు కాగా, 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 'కరోనా' కేసులు 13,387 నమోదయ్యాయని, 1,749 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడ్డవారిలో 80 శాతం మంది కోలుకుంటున్నారని వివరించారు. ఇక కర్ణాటకలో ఈ రోజు 38 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 353కి చేరుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories