మోదీకి ఉపాసన చేసిన ట్వీట్ పై స్పందించిన రామ్ చరణ్!

మోదీకి ఉపాసన చేసిన ట్వీట్ పై స్పందించిన రామ్ చరణ్!
x
Highlights

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరాది నటీ నటులను మోదీ ప్రత్యేకంగా ఆహ్వానించి, విందు...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరాది నటీ నటులను మోదీ ప్రత్యేకంగా ఆహ్వానించి, విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ద‌క్షిణాది నుండి దిల్ రాజు మిన‌హా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమల నుండి ఏ సెలబ్రిటీకి ఆహ్వానం అందలేదు. దీనిపై రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న ట్విట్టర్ వేదిక‌గా మోదీకి సున్నితంగా ట్వీట్ పెట్టారు.

అయితే ఉపాసన చేసిన ఈ ట్వీట్‌పై తాజాగా రామ్ చరణ్ స్పందించారు. ఉపాసన మోదీగారిని ఎక్కడ విమర్శించలేదన్నారు చెర్రీ. ఎంతో మర్యాదగా తన బాధని వ్యక్తం చేసిందన్నారు. నిజానికి ఉపాసన ట్వీట్ చేసిన విషయం తనకు ఆ తర్వాత ఎప్పుడో తెలిసిందన్నారు రామ్ చరణ్. ఈ విషయం తనకు ఎందుకు చెప్పలేదని ఉపాసనని చెర్రీ ప్రశ్నంచినట్లుగా తెలిపారు. అయితే తనకు చెబితే ఎక్కడ వద్దంటావని చెప్పకుండనే ట్వీట్ చేసిందని రామ్‌చరణ్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories