మెగా హీరో సినిమాపై మెగా హీరోలు ఏమన్నారంటే?

మెగా హీరో సినిమాపై మెగా హీరోలు ఏమన్నారంటే?
x
Sai Dharam Tej ( File Photo)
Highlights

చిత్రలహరి సినిమా తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం 'ప్రతి రోజూ పండగే' .. ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. సత్యరాజ్‌, రావు రమేష్...

చిత్రలహరి సినిమా తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం 'ప్రతి రోజూ పండగే' .. ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. సత్యరాజ్‌, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. మారుతిదర్శకత్వం వహించగా, యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సినిమాని నిర్మించాయి. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాపైన మెగా హీరోలు రామ్ చరణ్ , ఆలు అర్జున్ స్పందించారు.

ఈ చిత్రాన్ని చూసిన రామ్‌ చరణ్‌ సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తూ.. 'కుటుంబ విలువల్ని తెలివిగా, వినోదాత్మకంగా మలచి తీసినసినిమా 'ప్రతిరోజూ పండగే'.. ఈ సినిమాని కచ్చితంగా చూడాలి. చిత్ర బృందం పనితీరు బాగుంది' అని చరణ్ ట్వీట్ చేశారు.

ఇక అల్లు అర్జున్‌ 'ప్రతిరోజూ పండగే' చిత్రాన్ని చూసి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు "ఈ సినిమాతో సాయితేజ్‌ హిట్‌ అందుకున్నందుకు, స్నేహితుడు మారుతి విజయం సాధించినందుకు, బన్నీ వాసు ఓ మంచి సినిమాను తన ఖాతాలో వేసుకున్నందుకు, నా తండ్రి మంచి వసూళ్లను రాబట్టుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. యూవీ ఫిల్మ్స్‌కు కంగ్రాట్స్‌. ఈ సినిమాతో మరో మంచి ఆల్బమ్‌ను అందించిన తమన్‌కు అభినందనలు" అని బన్నీ పేర్కొన్నారు.

ఇక సినిమా విషయానికి వచ్చేసరికి ఈ సినిమా సాయి తేజ్‌ కెరీర్‌లోనే రికార్డు సృష్టించింది. అమెరికా బాక్సాఫీసు వద్ద అత్యధికంగా కలెక్షన్స్‌ రాబట్టిన తేజ్‌ చిత్రంగా నిలిచింది. తేజు తన తదుపరి చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడితో చేయబోతున్నాడు. ఈ సినిమాకి సోలో లైఫే సో బెటర్ అని టైటిల్ ని ఫిక్స్ చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories