కారు ప్రమాదంపై స్పందించిన రాజశేఖర్‌

కారు ప్రమాదంపై స్పందించిన రాజశేఖర్‌
x
Highlights

హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ఆయన కారు మూడు పల్టీలు కొట్టింది. కారు బెలూన్స్...

హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ఆయన కారు మూడు పల్టీలు కొట్టింది. కారు బెలూన్స్ తెరుచుకోవడంతో రాజశేఖర్ కు ప్రాణపాయం తప్పింది.

అయితే ఈ ప్రమాదంపై హీరో రాజశేఖర్ స్పందించారు. తనకు ఎలాంటి గాయాలు కాలేదని రాజశేఖర్ తెలిపారు. క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు. నిన్న రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ప్రమాదం జరిగిందని రాజశేఖర్ చెప్పారు. అప్పుడు కారులో తాను ఒక్కడినే ఉన్నానని తెలిపారు. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, తనను బయటకు లాగారని చెప్పారు రాజశేఖర్. వెంటనే తాను పోలీసులకు, కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించానన్నారు.

అయితే అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో రాజశేఖర్ ఒక్కరే ఉన్నారని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్‌ నుంచి కారును పోలీస్ స్టేషన్‌కు తరలించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories