మా పిల్లలను చూస్తే గర్వంగా ఉంది : రాజమౌళి

మా పిల్లలను చూస్తే గర్వంగా ఉంది : రాజమౌళి
x
Rajamouli ( File photo)
Highlights

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి తనయులు జై సింహ, కాలబైరవ చేసిన మత్తు వదలరా సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో...

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి తనయులు జై సింహ, కాలబైరవ చేసిన మత్తు వదలరా సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. నటనగా పరంగా జై సింహ మంచి మార్కులు పడ్డాయి.ఇక సంగీత దర్శకుడిగా కాలబైరవ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే ఈ సినిమాపైన టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి స్పందించాడు.

"మత్తు వదలరా సినిమాని లాస్ట్ నైట్ చూసాను. ఓ మంచి గ్రిప్పింగ్ , సస్పెన్స్ థ్రిల్లర్, కామెడీ కూడా చాలా బాగుంది. రితేశ్‌ రానా సినిమాని బాగా తెరకెక్కించాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. ఇక మా పిల్లల గురించి ఎం చెప్పుకోవాలి. నాకెంతో గర్వంగా ఉంది. మీరు కూడా నినిమా చూని మీ అభిషప్రాయాన్ని పోన్ట్‌ చేయండి. మీ అభిప్రాయాల నుంచి వాళ్లు భవిష్యత్తులో మరిన్ని విషయాలు నేర్చుకుంటారని రాజమౌళి" ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఇక ఇదే సినిమాపైన దర్శకుడు సుకుమార్ స్పందించారు. " మత్తు వదలరా సినిమా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి థ్రిల్లర్‌ సినిమా ఇది. ఇక నా దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన కీరవాణికి రెండో కుమారుడు సింహా ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయం కావడం నాకెంతో గర్వంగా ఉందని, కాలభైరవ ఈ సినిమాతో ఆదరగోట్టాడని చెప్పుకొచ్చాడు సుకుమార్"

ఇక ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ , రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి ఆర్.ఆర్.ఆర్ సినిమాని చేస్తున్నాడు. ఇక సుకుమార్ అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories