RRR తర్వాత మహేష్ తో సినిమా : రాజమౌళి

RRR తర్వాత మహేష్ తో సినిమా : రాజమౌళి
x
Highlights

టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి... దర్శకత్వంలో ఒక సినిమా అయినా చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు.

టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి... దర్శకత్వంలో ఒక సినిమా అయినా చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు.. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)..అనే సినిమాని తెరకెక్కిస్తున్నా డు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.

దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడింది. సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్రప్రసాద్ కథను అందించారు.

అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా తీస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.. ఇప్పటికే ప్రభాస్ పేరు కూడా బాగానే వినిపిస్తోంది. అయితే తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి దీనిపైన స్పందించాడు. తన తదుపరి చిత్రం గురించి మాట్లాడుతూ.. ఇందులో పెద్ద సృష్టి రహస్యం ఏమీ లేదని ఎప్పటినుంచో అనుకున్నదే .. మహేష్ బాబుతో సినిమా ఉంటుందని వెల్లడించాడు. ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై కే.ఎల్ నారాయణ నిర్మిస్తున్నట్లుగా రాజమౌళి వెల్లడించారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరశురాంతో ఓ సినిమాని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు...


Show Full Article
Print Article
More On
Next Story
More Stories