ఇటివల విడుదలైన 'రాహు' సినిమా హీరోయిన్ కృతి గార్గ్ కిడ్నాప్ అయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా...
ఇటివల విడుదలైన 'రాహు' సినిమా హీరోయిన్ కృతి గార్గ్ కిడ్నాప్ అయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఫోన్ చేసి ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఉందని, ఓ కుర్రాడు కృతి గార్గ్, రాహు దర్శకుడు సుబ్బుతో ఫోన్ లో మాట్లాడాడు. అయితే కృతి గార్గ్ ముంబై వెళ్ళడం అక్కడి వెళ్ళాక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో దర్శకుడు సుబ్బు కంగారు పడి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు..
అయితే దీనిపైన హీరోయిన్ కృతి గార్గ్ క్లారిటీ ఇచ్చింది. తానూ క్షేమంగా ఉన్నానని, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని వీడియో కాల్ ద్వారా వెల్లడించింది. ముంబైలో తన ఇంటికి రాగానే నిద్రపోయానని, దర్శకుడు సుబ్బు ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడి ఉంటాడని, కానీ ఇప్పుడు నేను నేను సేఫ్గానే ఉన్నానని వెల్లడించింది. సందీప్ రెడ్డి వంగా పేరుతో ఓ వ్యక్తి ఫోన్ నాకు చేయడం, ఆ సినిమాలో ఆఫర్ ఉందని చెప్పిన మాట వాస్తవేమని కానీ అవి నేను నమ్మలేదని వెల్లడించింది. అయితే మరి ఆమెకి ఫోన్ చేసింది ఎవరు? అన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
I request the media to not put out wrong news. I was supposed to travel today to Mumbai, where I live, after finishing the promotions for my movie Raahu.
— Kriti Garg (@kritigarg15) March 2, 2020
I came home today. It has nothing to do with any movie project or anything else.
ఇక రాహు సినిమా విషయానికి వస్తే, అభిరామ్ వర్మ,కృతి గర్గ్ హీరో హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థ్రిల్లర్ కథాశంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకొని దూసుకుపోతుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire