స్టార్ హీరోతో పూరి పాన్‌ ఇండియా మూవీ?

స్టార్ హీరోతో పూరి పాన్‌ ఇండియా మూవీ?
x
puri jagannadh(File photo)
Highlights

టాలీవుడ్ డైరెక్టర్స్ , హీరోస్ మొత్తం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ పైన పడ్డారు. బాహుబలి సినిమా దీనికి ట్రెండ్ పలికింది అని చెప్పాలి.

టాలీవుడ్ డైరెక్టర్స్ , హీరోస్ మొత్తం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ పైన పడ్డారు. బాహుబలి సినిమా దీనికి ట్రెండ్ పలికింది అని చెప్పాలి. ఈ సినిమా ఇచ్చిన రిలిజ్ట్ తో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా లాంటి సినిమాలు ముందుకు వచ్చాయి. ఇక ఇది ఇలా ఉంటే డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

అందులో భాగంగానే ఓ కొత్త కథని పూర్తి స్థాయిలో సిద్దం చేశారు. ఇప్పటికే ఈ కథని ఓ స్టార్ హీరోకి పూరి వీడియో కాల్‌ ద్వారా వినిపించాడని, దీనికి కూడా సదరు హీరో ఒకే చెప్పాడని తెలుస్తోంది. బాలీవుడ్ లోని ఓ నిర్మాత ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. త్వరలో దీనిపైన ఓ ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

ఇక ప్రస్తుతం పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి లిగర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. బాక్సింగ్ నేపధ్యంలో ఈ సినిమా సాగనుంది. ముంబైలో మొదలైన సినిమా షూటింగ్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలని తెరకెక్కించారు.

అ తరవాత దేశంలో కరోనా మొదలవ్వడంతో సినిమా షూటింగ్ ని వాయుదా వేశారు. పాన్‌ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని చార్మీతో పాటుగా కరణ్‌జోహార్‌ కలిసి నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత పూరి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories