టాలీవుడ్ లో మరో విషాదం..

టాలీవుడ్ లో మరో విషాదం..
x
Highlights

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత విజ‌య బాపినీడు అనారోగ్యంతో కన్నుమూసిన సంఘటన మరువక ముందే సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ మహిళా ప్రొడ్యూసర్...

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత విజ‌య బాపినీడు అనారోగ్యంతో కన్నుమూసిన సంఘటన మరువక ముందే సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ మహిళా ప్రొడ్యూసర్ నారా జయశ్రీ దేవి అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బెంగుళూరుకు తరలించినట్టు తెలుస్తోంది.

కన్నడ పరిశ్రమలో దాదాపు 25 చిత్రాలు నిర్మించారు. తెలుగులో చిరంజీవితో మంజునాథ, కృష్ణతో చంద్రవంశం, ఆదిశంకరాచార్య చిత్రాలు నిర్మించారు. కన్నడలో నిశ్శబ్ద, నమ్ముర మందార హువే, హబ్బా, అమృతవర్షిణి, ముకుందా మురారి వంటి చిత్రాలు రూపొందించారు. తాజాగా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'కురుక్షేత్ర' సినిమా నిర్మాణం చేస్తున్నారు. కాగా జయశ్రీ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories