ఫ్యాన్స్ ని నిరాశపరిచిన ప్రభాస్

ఫ్యాన్స్ ని నిరాశపరిచిన ప్రభాస్
x
Highlights

బాహుబలి, సాహో సినిమాల తరవాత ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే..

బాహుబలి, సాహో సినిమాల తరవాత ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటిస్తోంది. అయితే ఈ సినిమా గురించి తాజా అప్డేట్ ని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం నిన్న ప్రకటించింది.

సినిమా నుంచి అప్డేట్ వస్తుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మాములు ప్రేక్షకులు కూడా ఏంటి ఆ అప్డేట్ అని తెగ ఆత్రుతగా ఎదురుచూశారు . అయితే ఆ అప్డేట్ సినిమాకి సంబంధించిన టైటిలా లేకా ప్రభాస్ ఫస్ట్ లుక్ అయి ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ కేవలం ఈ రోజు నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభిస్తున్నాం అంటూ ఓ ఫోటోతో ఇన్స్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌తో సరిపెట్టాడు ప్రభాస్‌. దీనితో ఫ్యాన్స్ నిరాశచెందారు.

సాహో సినిమా నడుస్తున్నప్పుడే ఈ సినిమాని మొదలు పెట్టాడు హీరో ప్రభాస్ .. సినిమాకి సంబంధించిన ఓ షెడ్యుల్ లో ప్రభాస్ పాల్గొన్నాడు. ఆ తర్వాత షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది, ఈ క్రమంలో గురువారం ప్రభాస్‌ కొత్త సినిమా గురించి అప్డేట్ ని ఇచ్చింది. ఈ సినిమాకి జాన్ అనే టైటిల్ ని పరిశీలనలో ఉంచారు. ఈ సినిమాను 2020 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

కే రాధాకృష్ణ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్నఈ సినిమా తర్వాత ప్రభాస్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ ద‌ర్శక‌త్వంలో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే వీరి మధ్య కథ చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం విడుదలై మంచి టాక్ ని సంపాదించుకుంది. ఇందులో అల్లు అర్జున్ , పూజా హేగ్దే హీరో హీరోయిన్లుగా నటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories