ఆ సినిమాకి సీక్వెల్ చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ?

ఆ సినిమాకి సీక్వెల్ చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
x
Highlights

ఒక పక్క రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోపక్క వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్... ఇప్పటికే పంక్ రీమేక్ షూటింగ్ శేరవేగంగా జరుపుకుంటుంది.

ఒక పక్క రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోపక్క వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్... ఇప్పటికే పంక్ రీమేక్ షూటింగ్ శేరవేగంగా జరుపుకుంటుంది. పవన్ ఈ షూటింగ్ లో పాల్గోన్న క్లిప్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ సినిమాకి వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ కి ఇది 26 వ సినిమా.. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమాని చేస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా, పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు పవన్ .. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది!

ఈ సినిమాలతో పాటుగా ప‌వ‌న్‌ కల్యాణ్ మ‌రో మూడు చిత్రాల‌కు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. అందులో త్రివిక్రమ్ ద‌ర్శక‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత ఎస్‌. రాధాకృష్ణ నిర్మించ‌నున్న సినిమా ఒక‌టి కాగా, పూరి ద‌ర్శక‌త్వంలో మరో సినిమా అని తెలుస్తోంది. అయితే ఇవే కాకుండా పవన్ మరో సీక్వెల్ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. 2015లో వెంకటేష్, పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన 'గోపాల గోపాల' చిత్రానికి సీక్వెల్ చేసేందుకు పవన్ సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది!

ఈ సినిమాని కిషోర్ పార్ధసాని తెరకెక్కించారు. బాలీవుడ్ లో వచ్చిన 'ఓ మై గాడ్' సినిమాకి ఇది రీమేక్.. అయితే భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిన ఫ‌ర‌వాలేద‌నిపించింది. అయితే త్వర‌లో ఇదే చిత్రానికి సీక్వెల్‌ని చేయాలనీ కిషోర్ కుమార్ పార్థసాని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇప్పటికే దీనిపైన పవన్ తో సంప్రదింపులు చేయగా, మంచి కథ దొరికితే చేసేందుకు సిద్ధమని పవన్ కూడా చెప్పినట్టుగా సమాచారం.. మంచి క‌థ సెట్టయితే `గోపాల గోపాల-2` తెర‌పైకి రావ‌డం ఖాయమేనని తెలుస్తోంది!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories