ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించిన బాలకృష్ణ

ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించిన బాలకృష్ణ
x
Highlights

టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతి నేడు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌ దగ్గర ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే...

టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతి నేడు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌ దగ్గర ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా నివాళులర్పించారు. నందమూరి బాలయ్య, రామకృష్ణ, సుహాసినితో పాటూ పలువురు ట్యాంక్‌బండ్‌ సమీపంలోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

పలు చోట్ల అభిమానులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజును తెలుగు ప్రజలు ఓ పండుగలా భావిస్తున్నారన్నారు బాలయ్య. ఆయన నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలుగు ప్రజల రుణం తీర్చుకోవడానికి పార్టీ స్థాపించారన్నారు. విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. తెలుగువాళ్ల సత్తా జాతీయస్థాయిలో చాటిన నేత ఎన్టీఆర్ అన్నారు.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories