బాలీవుడ్ లోకి నితిన్ భీష్మ.. హీరోగా ఎవరంటే?

బాలీవుడ్ లోకి నితిన్ భీష్మ.. హీరోగా ఎవరంటే?
x
Bheeshma movie
Highlights

తెలుగులో మంచి హిట్ అయిన సినిమాలపైన బాలీవుడ్ బాగానే ఫోకస్ చేస్తోంది.

తెలుగులో మంచి హిట్ అయిన సినిమాలపైన బాలీవుడ్ బాగానే ఫోకస్ చేస్తోంది.ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేయగా అక్కడ భారీ కలెక్షన్స్ ని సాధించిన సంగతి తెలిసిందే.. ఇక నాని జెర్సీ, కార్తికేయ ఆర్ ఎక్స్ 100 చిత్రాలు కూడా హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో సినిమా రీమేక్ పైన బాలీవుడ్ కన్నేసినట్టుగా తెలుస్తోంది.

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ఇందులో నితిన్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం గత నెల ఫిబ్రవరి మహాశివరాత్రి రోజున విడుదలైంది. సినిమాకి మొదటి ఆట మంచి టాక్ వచ్చింది. మంచి టాక్ రావడంతో ఈ సినిమా కి భారీ కలెక్షన్స్ వచ్చాయి. నితిన్ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ గా రికార్డు సృష్టించింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో కూడా రిలీజ్ చేయాలని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో రణ్ బీర్ కపూర్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ ప్రస్తుతం లవ్ రంజన్, బ్రహ్మస్త్ర, షమ్ షేరా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత 'భీష్మ' రీమేక్ పైన రణ్ బీర్ ఫోకస్ చేయనున్నట్లుగా సమాచారం..

ఇక భీష్మ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నితిన్ ఆ తర్వాత విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. రంగ్ దే చిత్రంలో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు ఈ సంవత్సరంలోనే విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories