అవకాశాల కోసం డబ్బులు అడిగి మోసం చేసారు.. మా నాన్న దగ్గరి నుండి...

అవకాశాల కోసం డబ్బులు అడిగి మోసం చేసారు.. మా నాన్న దగ్గరి నుండి...
x
Highlights

హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్... తెలంగాణా బాషలో మాట్లాడుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ప్లాప్...

హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్... తెలంగాణా బాషలో మాట్లాడుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. చాలా కాలం తర్వాత స్వామిరారా సినిమాతో మళ్ళీ హిట్టు మెట్టు ఎక్కాడు నిఖిల్.. ఆ తర్వాత సినిమాలు లేట్ అయిన పర్వాలేదు కానీ కథలో ఎంపీకలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చాడు.

స్వామిరారా సినిమా తర్వాత నిఖిల్ నుండి మంచి సినిమాలు వచ్చాయని చెప్పాలి. ఇటీవల ఆయన నటించిన 'కిర్రాక్ పార్టీ' విడుదలై బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా అలరించలేదు. అయితే తాజాగా మంచు లక్ష్మి హోస్ట్ గా చేస్తున్నా 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' అనే రియాలిటీ షోలో పాల్గొన్నాడు నిఖిల్.. ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు..

సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాను. అందులోనే చాలా చేదు అనుభవాలకు ఎదుర్కున్నాని అన్నాడు.. కొందరు సినిమాలో అవకాశాలు ఇస్తామని మోసం చేసారని అన్నాడు. సినిమాల్లో ఒక్కో పాత్ర కోసం రూ.5లక్షల నుండి రూ.10లక్షల వరకు డిమాండ్ చేశారని చెప్పాడు. అయితే అంత డబ్బు నా దగ్గర లేకపోవడంతో మా నాన్న దగ్గర అడిగి వారికి చెల్లించానని నిఖిల్ చెప్పుకొచ్చాడు.

ఇక అది పక్కన పెడితే నిఖిల్ హీరోగా నటించిన 'అర్జున్ సురవరం' సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తి అయింది. కానీ పలు కారణాల వల్ల సినిమా విడుదల వాయుదా పడుకుంటూ వస్తుంది. ఇందులో నిఖిల్‌కు జంటగా లావణ్య త్రిపాఠి నటించింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories