పాయల్ పై నెటిజన్లు ఆగ్రహం... కారణం ఇదే!

పాయల్ పై నెటిజన్లు ఆగ్రహం... కారణం ఇదే!
x
payal rajput
Highlights

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపైన పడింది. ఇక చిత్ర పరిశ్రమపైన పడడంతో థియేటర్స్ మూతపడ్డాయి. షూటింగ్ లు వాయిదా పడ్డాయి. దీనితో సినీ కార్మికుల బతుకులు రోడ్డు మీదా పడ్డాయి.

కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపైన పడింది. ఇక చిత్ర పరిశ్రమపైన పడడంతో థియేటర్స్ మూతపడ్డాయి. షూటింగ్ లు వాయిదా పడ్డాయి. దీనితో సినీ కార్మికుల బతుకులు రోడ్డు మీదా పడ్డాయి.వీరిని ఆడుకోవడం కోసం చిత్ర పరిశ్రమలోని నటులు ముందుకు వచ్చి తమ వంతు సహాయంగా విరాళాన్ని ప్రకటిస్తున్నారు. అయితే ఇందులో నటీమణులు తక్కువ మంది ఉన్నారు. లావణ్య త్రిపాఠి, యాంకర్ రష్మి, ప్రణీత లాంటి చిన్న చిన్న వాళ్లు సహాయం చేశారు.

ఇక స్టార్ హీరోయిన్స్ స్పందించకపోవడంపై నటుడు బ్రహ్మాజీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై నుంచి వచ్చిన ఎందరో హీరోయిన్లు ఇక్కడ పని చేస్తున్నారని... అయితే కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఛారిటీ కోసం ఎవరూ స్పందించడం లేదని మండిపడ్డాడు.

ఇక ఇదిలా ఉంటే కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. అయితే ఇదేమి పట్టనట్టుగా హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ ఓ పార్క్‌లో ఫొటో షూట్‌ చేసినఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోకు సామాజిక మాధ్యమలలో వైరల్ అవుతున్నాయి. దీనితో ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్ ని అరికట్టేందుకు ఇంట్లోనే ఉండండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా మీ చుట్టూ ఉండే జనాన్ని.. ఈ దేశాన్ని కాపాడండి అంటూ ప్రభుత్వాలు నొక్కి మరి చెప్తుంటే మీరు మాత్రం ఎలాంటి బాధ్యత లేకుండా లాక్ డౌన్ టైంలో పార్కుల్లో తిరుగుతూ ఫొటోలకు పోజులు కొడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పదిమందికి నీతులు చెప్పే సెలబ్రిటీలు తాము మాత్రం పాటించరా? అంటూ మండిపడ్డారు.

అయితే దీనిపైనే స్పందించిన పాయల్ అవి ఇప్పటి ఫోటోలు కావని, ఆహ్లాదకరమైన వాతావరణం అంటే తనకు ఇష్టం అని,ఆ రోజుల్ని మిస్ అయ్యా అంటూ మరో పోస్ట్ పెట్టింది పాయల్.. ఇక పాయల్ ఈ ఏడాది ఆరంభంలో రవితేజ హీరోగా నటించిన డిస్కోరాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories