మన్మధుడు2 సినిమా తరవాత అక్కినేని నాగర్జున నుంచి ఒక్క సినిమా కూడా అనౌన్స్ కాలేదు. తెలుగు బిగ్ బాస్ 3తో
మన్మధుడు2 సినిమా తరవాత అక్కినేని నాగర్జున నుంచి ఒక్క సినిమా కూడా అనౌన్స్ కాలేదు. తెలుగు బిగ్ బాస్ 3తో బిజీ అయిపోయిన నాగ్ సినిమాలను పక్కన పెట్టేశాడు. మళ్ళీ ఇప్పుడు కథలు వింటూ ఒక్కొక్కటిగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే ఉపిరి, మహర్షి చిత్రానికి కథ అందించిన అహిషోర్ సోలోమన్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు నాగ్..
ఇందులో ఎన్ఐఏ పోలీస్ ఆఫీసర్ విజయ్ వర్మగా నాగ్ కనిపించనున్నారు. దీనికి 'వైల్డ్ డాగ్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా సినిమాకి సంబంధించిన ఫస్ట్లుక్ను హీరో నాగార్జున శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగ్ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ .. ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉందని, ..కొంత టెక్నీషియన్స్తో వినూత్నంగా సినిమాను తెరకెక్కిస్తున్నాం. 2020 ఎంతో అద్భుతంగా ఉండబోతోందని" పేర్కొన్నాడు. ఇక సినిమాలోని నటినటులను త్వరలో ప్రకటించనున్నారు.
ఇక ఇదే సినిమా కాకుండా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్ ని చేసేందుకు సిద్దం అయ్యారు. బంగార్రాజు టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు.
Excited to be part of a true life inspired drama after a long time. Playing a NIA officer!!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 27, ౨౦౧౯
New age technicians and new format film making. One never stops learning!! 2020 IS GOING TO BE EXCITING!!! @MatineeEnt #WildDog pic.twitter.com/QeIJ7KzVHD
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire