ఈ తప్పు ప్రభుత్వందే : జనాలకి బాధ్యతలు నేర్పే టైం వచ్చింది : నాగబాబు

ఈ తప్పు ప్రభుత్వందే : జనాలకి బాధ్యతలు నేర్పే టైం వచ్చింది : నాగబాబు
x
Nagababu (File Photo)
Highlights

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 195 దేశాలకి పైగా విస్తరించిన ఈ మహమ్మారి వ్యాధి వలన ప్రపంచవ్యాప్తంగా 20,000 మంది కి పైగా చనిపోయారు.

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 195 దేశాలకి పైగా విస్తరించిన ఈ మహమ్మారి వ్యాధి వలన ప్రపంచవ్యాప్తంగా 20,000 మంది కి పైగా చనిపోయారు. ఇక భారత్లో ఆరువందలకు పైగా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. అయితే దీన్ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటికే ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ జనాలు రోడ్లపైకి వస్తున్నారు.

ఇక కరోనా వైరస్ దేశంలో మొదలైనప్పటి నుంచి మెగా బ్రదర్ నాగబాబు వరుసగా ట్వీట్ల మీదా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు.. మా దేవుడు గొప్ప,మా దేవుడు గొప్ప అని ఇంకా కొట్టుకొని చావకండి.. వెళ్లి సైంటిస్టులకి మొక్కుదాం.ఈ కరోనా బారినుంచి మనల్ని కపడేది వాళ్లే.. అంటూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ వస్తున్నారు. ఇక ప్రధాని మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ కి మద్దతు తెలిపారు . అంతేకాకుండా జనతా కర్ఫ్యూ కి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఇక తాజాగా న్యూస్లో ప్రొఫెసర్ దాస్ గారు అన్నమాట నాకు చాలా నచ్చింది."మనం ప్రజలకి హక్కులు నేర్పాము.బాధ్యతలు నేర్పలేదు"అక్షర సత్యం ...ఈ తప్పు ప్రభుత్వం వారిదే.మా జనాలకి బాధ్యతలు నేర్పే టైం వచ్చింది.నేను కూడా అతితుడ్ని కాదు.మా ప్రజలందరికీ తన్ని బాధ్యతలు నేర్పించండి. నేర్చుకుంటాం..." అంటూ మరో ట్వీట్ చేశారు..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories