ఇదేమి పద్ధతో నాకు తెలియడం లేదు.. సెన్సార్ బోర్డుపై హీరో సీరియస్

ఇదేమి పద్ధతో నాకు తెలియడం లేదు.. సెన్సార్ బోర్డుపై హీరో సీరియస్
x
Highlights

రాజ్ సూరియ‌న్ హీరోగా , ఆకర్షిక‌, నస్రీన్ హీరోయిన్స్ గా నటించిన తాజా చిత్రం 'నా పేరు రాజా' అమోఘ్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై రాజ్ సూరియ‌న్‌, ప్రభాక‌ర్ రెడ్డి, కిర‌ణ్ రెడ్డి నిర్మిస్తున్నారు.

రాజ్ సూరియ‌న్ హీరోగా , ఆకర్షిక‌, నస్రీన్ హీరోయిన్స్ గా నటించిన తాజా చిత్రం 'నా పేరు రాజా' కన్నడ, తెలుగు భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అశ్విన్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, అమోఘ్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై రాజ్ సూరియ‌న్‌, ప్రభాక‌ర్ రెడ్డి, కిర‌ణ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ రోజు సినిమాకి సంబంధించిన టీజర్ ని ఫిలించాంబ‌ర్ లో రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర హీరో సూరియ‌న్ మాట్లాడుతూ.. " గతంలో నేను తెలుగులో 'తిరుగుబోతు', 'జటాయువు' అనే సినిమాలు చేశారు. ఇప్పుడు 'నా పేరు రాజా' అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాలో మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నేను నటించాను. కన్నడ, తెలుగు భాషలలో ఈ సినిమాని నిర్మించాము. రొమాంటిక్ లవ్ డ్రామాగా తీసిన ఈ సినిమా మీకు నచ్చుతుందని అనుకుంటున్నామని" అన్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించి కన్నడలో సెన్సార్ కంప్లీట్ అయ్యిందని.. కానీ తెలుగులో మాత్రం సెన్సార్ ఇవ్వడానికి ఎందుకో ఆలస్యం చేస్తున్నారని సూరియన్ అన్నారు. గట్టిగా అడిగితే ఇక్కడ పద్ధతి మీకు తెలియదంటున్నారు. ఇదేమి పద్ధతో నాకు తెలియడం లేదని అన్నాడు. ఈ సినిమాని జనవరి 31న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని, ఈ నెల 20న ట్రైలర్ విడుదల చేస్తామని సూరియన్ పేర్కొన్నాడు.

ఇక చిత్ర టీజర్ విషయానికి వచ్చేసరికి 01: 57 సెకండ్స్ తో ఉన్న ఈ టీజర్ లో ఎక్కువ భాగం యూత్ ని టార్గెట్ చేసిన సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాకి వెంకట్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎల్‌విన్ జోషువా సంగీతం అందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories