బన్నీ తో ప్రభాస్ దర్శకుడు సినిమా చేయట్లేదా

Allu Arjun
x
Allu Arjun
Highlights

శర్వానంద్ హీరోగా 'రన్ రాజా రన్' సినిమా తో దర్శకుడిగా మారిన సుజిత్ మొదటి సినిమాతోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని మెప్పించాడు. వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతుంది అని అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి.

శర్వానంద్ హీరోగా 'రన్ రాజా రన్' సినిమా తో దర్శకుడిగా మారిన సుజిత్ మొదటి సినిమాతోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని మెప్పించాడు. వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతుంది అని అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి. అయితే దాదాపు రెండు మూడు సంవత్సరాలు వెయిట్ చేసి మరీ ప్రభాస్ తో 'సాహో' సినిమా మొదలుపెట్టాడు ఈ యువ దర్శకుడు. మరి 'సాహో' విడుదల తర్వాత అయినా బన్నీ సుజిత్ కాంబోలో సినిమా రానుందా అంటే సుజిత్ ప్రస్తుతం తన పూర్తి దృష్టి మొత్తం 'సాహో' పైనే పెట్టాడు. మరోవైపు బన్నీ కూడా త్రివిక్రమ్ తోనే సినిమా చేయనున్నాడని సమాచారం.

పైగా సుజిత్ దర్శకత్వం వహించనున్న మూడవ సినిమా 'సాహో' ఫలితం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉండగా యు.వి.క్రియేషన్స్ ఇప్పటికే సుజిత్ ను మరొక సినిమా కోసం లాక్ చేసిందని సమాచారం. అటువైపు మైత్రి ప్రొడక్షన్ బ్యానర్ వారు కూడా సుజిత్ తో సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ నేపథ్యంలో బన్నీ సుజిత్ కాంబోలో సినిమా రావటం ఇప్పట్లో అయితే ఇప్పట్లో జరిగే పని కాదని తెలుస్తోంది. బన్నీ తరువాత సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అలాగే 'సాహో' సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీఖున విడుదలవనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories