దేవి ఫోన్ చేసి ఆరు నెలలు అవుతుంది.. మా ఇద్దరి మధ్య ఉంది అదే

దేవి ఫోన్ చేసి ఆరు నెలలు అవుతుంది.. మా ఇద్దరి మధ్య ఉంది అదే
x
DSP
Highlights

రాబోయే సంక్రాంతికి మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల మధ్య పోటి మాత్రమే కాదు. ఈ సినిమాలకి సంగీతం అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్, తమన్ ల మధ్య కూడా పోటి...

రాబోయే సంక్రాంతికి మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల మధ్య పోటి మాత్రమే కాదు. ఈ సినిమాలకి సంగీతం అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్, తమన్ ల మధ్య కూడా పోటి ఉండబోతుంది. మహేష్ సరిలేరు నీకెవ్వరు కి దేవీ మ్యూజిక్ చేస్తుంటే, అల వైకుంఠపురములోకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మినిమం సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ప్రేక్షకుల ఆదరణ పరంగా చూసుకుంటే తమన్ సాంగ్స్ బాగా హిట్టు అయ్యాయి.

అల వైకుంఠపురములో నుంచి సామజవరగమనా, రాములో రాములా సాంగ్స్ 100 మిలియన్ మార్క్ ని అందుకొని యూ ట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ఈ సందర్భంగా తమన్ ని ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. అందులో భాగంగా సదరు విలేకరి మీ సామజవరగమన' పాట అంత హిట్టైంది కదా దేవి మీకు ఫోన్ చేసి విష్ చేశాడా అని అడగగా, దీనికి తమన్ స్పందిస్తూ.. లేదు.. అలా చెయ్యలేదు.. మేమిద్దరం మాట్లాడుకుని 6,7 నెలలు అవుతుంది. నా పుట్టినరోజున మాత్రం ట్విట్టర్లో విష్ చేశాడు. దేవి చేసిన 'రెడీ', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలకు నేను ప్రోగ్రామర్ గా పనిచేసాను. మా ఇద్దరి మధ్య మంచి హేల్తీ కాంపిటిషన్ ఉందని చెప్పుకొచ్చాడు తమన్ .

సంక్రాంతి పండగ కానుకగా సరిలేరు నీకెవ్వరు జనవరి 11 న , అల వైకుంఠపురములో జనవరి 12 న ఇలా ఒక్కరోజు గ్యాప్ లో విడుదలవుతున్నాయి. ఈ సినిమాలపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories