రూట్ మార్చుతున్న హీరోలు.. మళ్ళీ మణిశర్మ బ్యాక్ అనుకోవచ్చా ?

manisharma
x
manisharma
Highlights

మెలోడి బ్రహ్మాగా టాలీవుడ్ లో మణిశర్మకి మంచి పేరు ఉంది. అయన చేసిన మెలోడీ సాంగ్స్ కి ఇప్పటికి ఫ్యాన్స్ ఉన్నారంటే

మెలోడి బ్రహ్మాగా టాలీవుడ్ లో మణిశర్మకి మంచి పేరు ఉంది. అయన చేసిన మెలోడీ సాంగ్స్ కి ఇప్పటికి ఫ్యాన్స్ ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు.90 దశాబ్దంలో మణిశర్మ పాటలు బాగా పేలాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి అగ్ర కథానాయకుల సినిమాలకి ఆయనే ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు. పాటలకి మాత్రమే కాదు. నేపధ్య సంగీతం ఇవ్వడంలోను మణిశర్మ దిట్టె..

ప్రస్తుతం మణిశర్మకి సినిమా అవకాశాలు తగ్గాయి. యంగ్ జనరేషన్ దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి సంగీత దర్శకుల హవా నడుస్తుండడంతో మణిశర్మ వెనుకపడ్డారు. కానీ అయన సినిమాలు చేయడం లేదు అని కాదు. 2017 లో అయన 9 తొమ్మది సినిమాలు చేశాడు. గత సంవత్సరం మూడు సినిమాలు చేశాడు. ఇక సంవత్సరం చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ హిట్టు కొట్టడంతో మళ్ళీ మణిశర్మ పేరు బాగా వినిపిస్తుంది.

మళ్ళీ మణిశర్మతో సంగీతం చేయించుకునేందుకు సినీ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడని సమాచారం.. మణిశర్మని చిరంజీవినే చూజ్ చేసుకున్నారని సమాచారం.. ఇక వెంకటేష్ చేయబోయే అసురన్ తెలుగు రీమేక్ కి కూడా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాకి నేపధ్య సంగీతం ప్రధానం కావడంతో మణిశర్మ ని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాకి అదిరిపోయే సంగీతాన్ని అందించిన మణిశర్మనే తన తదుపరి చిత్రానికి కూడా సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు హీరో రామ్..కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకి రెడ్ అనే టైటిల్ ని పెట్టారు.

ఇలా వరుస ఆఫర్స్ వస్తుండడంతో మణిశర్మకి మళ్ళీ మంచి టైం స్టార్ట్ అయిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories