దేవీ మరో రికార్డు

దేవీ మరో రికార్డు
x
దేవీశ్రీ ప్రసాద్
Highlights

దేవీశ్రీ ప్రసాద్ ..పేరుతో పెద్దగా పరిచయం అక్కరలేదు. ఆయన అభిమానులు ఆయనని ముద్దుగా డీఎస్పీ అని పిలుస్తుంటారు.

దేవీశ్రీ ప్రసాద్ ..పేరుతో పెద్దగా పరిచయం అక్కరలేదు. ఆయన అభిమానులు ఆయనని ముద్దుగా డీఎస్పీ అని పిలుస్తుంటారు. మాట్లాడుతుంటేనే పాటలకి ట్యూన్స్ కట్టగలడు. ఆ పాటలకి అదిరిపోయే స్టెప్స్ కూడా వేయగలడు. తన సంగీతంతో ఇప్పుడు సౌత్ ఇండియా లోనే మోస్ట్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు దేవీ. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'దేవి' సినిమాతో తన కెరియర్ ని మొదలు పెట్టిన దేవిశ్రీ ప్రసాద్ ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఆనందం, మన్మధుడు, ఆర్య, శంకర్ దాదా ఎంబీబీఎస్, భద్ర సినిమాలు దేవీకి మంచి బ్రేక్ ఇచ్చాయి.

ఆ తర్వాత తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాందించుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా మంచి సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎనిమిది సార్లు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నాడు దేవీశ్రీ ప్రసాద్.. తాజాగా అతని ఖాతాలో మరో ఫిలిం ఫేర్‌ కూడా చేరిపోయింది. తాజాగా చెన్నైలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఫిలిం ఫేర్‌ అవార్డుల ప్రధానోత్సవంలో 'రంగస్థలం' చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా 9వ ఫిలిం ఫేర్‌ అవార్డును అందుకున్నాడు దేవి. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో అత్యధికంగా ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న సంగీత దర్శకుడిగా దేవీశ్రీ నిలిచారు. దేవీ తరవాత స్థానంలో యం.యం.కీరవాణి ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు 7 ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు దేవీ.. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన మూడు పాటలకి గాను మంచి పేరు వచ్చింది. ఈ పాటలు శ్రోతలను వీపరితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 11 న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని కాకుండా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోయే సినిమాకి కూడా దేవీనే సంగీతం అందిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories