Megastar Chiranjeevi: సోషల్ మీడియా లోకి చిరు ఎంట్రీ...

Megastar Chiranjeevi: సోషల్ మీడియా లోకి చిరు ఎంట్రీ...
x
Megastar chiranjeevi (File Photo)
Highlights

సోషల్ మీడియాలో కి ఎంట్రీ ఇస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు.

సోషల్ మీడియాలో కి ఎంట్రీ ఇస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు తనలోని భావాలను అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియానే చక్కటి వేదిక అని చిరంజీవి అభిప్రాయపడ్డారు... ఈ ఉగాది నుంచి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు చిరంజీవి వెల్లడించారు.. ఇప్పటివరకి చిరంజీవికి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు.. ఏది ఉన్న కొణిదెల ప్రొడక్షన్స్ అఫీషియల్ సైట్ నుంచే చిరంజీవి తన భావాలను వ్యక్త పరుస్తున్నారు.

ఇక చిరంజీవి ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ క్రియేట్ చేశారు. అందులోకీ ఇప్పటికే రెండు లక్షల 63వేలమంది ఫాలోవర్స్ వచ్చేశారు. ఉగాది సందర్భంగా చిరు రేపు తన ఫస్ట్ పోస్టును పెట్టనున్నారు. చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయంతో మెగా అభిమానులే కాకుండా మామూలు ప్రేక్షకులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరంజీవి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన ఏ వీడియో చేసిన లక్షలాది మంది విక్షీస్తుంటారు.

గతేడాది సైరా నరసింహారెడ్డి తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories