Megastar Chiranjeevi: భీష్మ సినిమాని వీక్షించిన మెగాస్టార్!

Megastar Chiranjeevi: భీష్మ సినిమాని వీక్షించిన మెగాస్టార్!
x
chiranjeevi watching bheeshma movie (File Photo)
Highlights

మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి వీక్షించారు.. ఈ విషయాన్ని దర్శకుడు వెంకీ కుడుముల ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.

యంగ్ హీరో నితిన్ శ్రీనివాస కళ్యాణం లాంటి ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ' భీష్మ' అనే సినిమాని చేశాడు.. .. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గాతెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా, సీతార ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించింది.

అయితే ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి వీక్షించారు.. ఈ విషయాన్ని దర్శకుడు వెంకీ కుడుముల ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. " నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన వ్యక్తి, నా దేవుడు మెగాస్టార్‌ చిరంజీవితో తాను దర్శకత్వం వహించిన చిత్రాన్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రయత్నాన్ని అభినందించిన చిరంజీవికి ధన్యవాదాలు. నేను ఈ విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను " అని వెంకీ వెల్లడించారు.

వెంకీ కుడుములకి దర్శకుడిగా ఇదో రెండో సినిమా.. సినిమా విడుదల నుంచి మంచి టాక్ వచ్చింది. ఆడియన్స్ నుంచి రివ్యూలు వరకు ఎక్కడ చూసిన అసలు జనాలు సీట్లలో కూర్చుంటేగా అన్నట్టుగానే సాగింది. అడుగడుగునా పంచెస్ తో,బ్యాక్ బ్యాక్ హిలేరియస్ సీన్స్ తో కితకితలు పెట్టి కామిడీ సన్నివేశాలు, నితిన్ డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని వేటికవే సమానంగా నిలిచాయి. దీంతో ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చాయి. నాలుగేళ్ల తర్వాత మళ్ళీ నితిన్ హిట్బాట పట్టాడు.

ఇక ఈ సినిమా తర్వాత నితిన్ విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. రంగ్ దే చిత్రంలో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు ఈ సంవత్సరంలోనే విడుదల చేయనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories