అమ్మకి ప్రేమతో .. దోశ వేసిన మెగాస్టార్

అమ్మకి ప్రేమతో .. దోశ వేసిన మెగాస్టార్
x
Highlights

కరోనా కట్టడికి కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే.. దీనితో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యారు.

కరోనా కట్టడికి కేంద్రం 21 రోజుల లాక్ డౌన్ ని విధించిన సంగతి తెలిసిందే.. దీనితో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఇక సెలబ్రిటీలు సైతం ఇంట్లోనే ఉంటూ అభిమానులకి కరోనా పై అవగాహనా కల్పిస్తూ కాలం గడుపుతున్నారు. అయితే తాజాగా అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగ ఇంటి పనులు చేస్తూ వీడియోను పోస్టు చేశాడు. ఇంటి పనులు చేస్తూ భార్యకు సాయం చేసేవాడే రియల్ మ్యాన్ అంటూ...టాలీవుడ్ లో "బీ ది రియల్ మెన్" ఛాలంజ్ అనే ట్రెండ్ కి నాంది పలికారు.

సందీప్ రెడ్డి వంగ నుంచి మొదలైన ఈ ఛాలంజ్ మెగాస్టార్ చిరంజీవి వరకు వచ్చి చేరింది. జూనియర్ ఎన్టీఆర్ విసరిన సవాల్ ని స్వీకరించిన చిరంజీవి ఇంటి పనులు చేశారు. వాక్యూమ్ క్లీనర్‌తొ ఇళ్లంతా క్లీన్ చేశారు. ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లి స్వయంగా దోశ వేశారు. ఆ తర్వాత ఆ దోశను తీసుకెళ్లి తన తల్లి అంజనా దేవికి అందించారు. ఆ తొలి ముద్దను కొడుకుకే తినిపంచారు అంజనాదేవి. ఆ తర్వాత ఆమె కూడా తిన్నారు. దీనికి సంబంధించిన వీడియోని చిరంజీవి పోస్ట్ చేశారు.

ఆ తర్వాత నేను రోజు చేసే పనులే...ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం అంటూ మంత్రి కేటీఆర్, తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఛాలంజ్ విసిరారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories