తమ్ముడి కంటే ఆ సినిమా ఏం ఎక్కువ కాదు : చిరంజీవి

తమ్ముడి కంటే ఆ సినిమా ఏం ఎక్కువ కాదు : చిరంజీవి
x
Chiranjeevi and Pawan Kalyan (File Photo)
Highlights

రాజకీయల నుంచి బయటకు వచ్చిన చిరంజీవి మళ్ళీ సినిమాల వైపే మొగ్గుచూపారు. ఖైది నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.

రాజకీయల నుంచి బయటకు వచ్చిన చిరంజీవి మళ్ళీ సినిమాల వైపే మొగ్గుచూపారు. ఖైది నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత తన డ్రీం ప్రాజెక్ట్ అయిన సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి మరే దర్శకుడితో కమిట్ అవ్వలేదు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తాడని టాక్..

అయితే తాజాగా ఓ ప్రముఖ దినపత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చిన చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అందులో భాగంగా మలయాళ చిత్రం లూసిఫర్ గురించి వెల్లడించారు. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన లూసిఫర్ భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాని చేసేందుకు చిరంజీవి సిద్దం అయ్యారు. దీనికి సంబంధించిన రీమేక్ హక్కులను సైతం ఇప్పటికే కొనేశారు చిరు..అయితే పవన్ కళ్యాణ్ చేయబోతున్నారనే వార్తలు రావడంతో చిరు దీనిపైన స్పందించారు.

ఆ సినిమా నేనే చేస్తా... తమ్ముడు చేయాలని ఉత్సాహపడితే తప్పకుండా తనకు ఇచ్చేస్తా. తనకు చేయాలనుందనే విషయం అయితే నా వరకు రాలేదని అన్నారు చిరంజీవి..ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ఈ సినిమా చేస్తే మాత్రం అంచానాలు మరింతగా పెరుగుతాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి దర్శకుడిని సెట్ చేసే పనిలో ఉన్నారు. బాబీ, సుజీత్ పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య పక్కా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతుంది. ఇందులో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది చిరంజీవికి 152వ సినిమా.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో రెజీనా ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావం వలన సినిమా వాయిదా పడింది.

ఇక పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలతో పాటు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ రీమేక్ గా పవన్ 'వకీల్ సాబ్' తెరకెక్కుతుంది. ఇది పవన్ కి 26 వ చిత్రం.. ఇందులో అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని మే 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories