చిన్నారుల చదువు బాధ్యత తీసుకున్న మెగాహీరో!

చిన్నారుల చదువు బాధ్యత తీసుకున్న మెగాహీరో!
x
Highlights

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఒక స్కూలును దత్తత తీసుకున్నారు. తాను హైదరాబాద్, మున్నిగూడలోని అక్షరాలయ పాఠశాలను దత్తత తీసుకున్నానని, రెండేళ్లుగా వందమందికిపైగా...

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఒక స్కూలును దత్తత తీసుకున్నారు. తాను హైదరాబాద్, మున్నిగూడలోని అక్షరాలయ పాఠశాలను దత్తత తీసుకున్నానని, రెండేళ్లుగా వందమందికిపైగా పిల్లలకు పౌష్టికాహార సంబంధమైన అవసరాల కోసం సహాయం చేస్తున్నానని తన ఇన్‌స్టాగ్రామ్ లో తెలిపారు. తాను రెండు సంవత్సరాలుగా 'థింక్ పీస్' సంస్థ తో కల్సి పని చేస్తున్నాననీ, ఇది తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందన్నారు. చిన్నారుల్లో వెలుగులు నింపేందుకు విరాళాలు సేకరించాలని అభిమానులను కోరారు. చిన్నారులకు సహాయం చేస్తే 'థింక్ పీస్' సంస్థతో పాటు చిన్నారులు, తాను కూడా మీకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నట్టు తెలిపారు. 100 మంది పిల్లలకు తాను సహాయం అందిస్తున్నానని చెప్పారు.

ఇటీవల దివ్యాంగునికి క్రీడల్లో సాయం చేసిన సాయిధరమ్ తేజ్ తాజాగా స్కూలు పిల్లలను దత్తత తీసుకోవడంపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో చిరంజీవి హోస్టుగా వచ్చిన 'మీలో ఎవ‌రు కోటీశ్వరుడు' షోలో తనకు వ‌చ్చిన‌ డ‌బ్బును కూడా ఈ స్కూల్ కోస‌మే సాయిధరమ్ ఖర్చు చేయడం గమనార్హం.


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

I have been associated with @thinkpeaceorg for the past couple of years and I've Adopted an Aksharalaya school in munniguda and sponsored the education and nutrition of over 100 kids over a period of two years...it's been overwhelming looking at those happy souls...So this an APPEAL TO ALL THE PEOPLE ON INSTAGRAM...please donate whatever you can...the kids,me and the whole of @thinkpeaceorg will be indebted to you for your support...will post the link in my bio 🙏🏼🙏🏼🙏🏼 thank you 😊 and here is the link as well https://www.thinkpeace.in/donate/sponsor-child and also this year I've adopted 50 more kids

sai tej (@jetpanja) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories