సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కి బ్రేక్ వచ్చింది. కరుణ వైరస్ ప్రభావం వలన ఈ సినిమా షూటింగ్ బ్రేక్ ఇచ్చారు దర్శక నిర్మాతలు.
అయితే గత కొద్ది రోజులుగా చిత్ర నిర్మాతలు అయిన రామ్ చరణ్ నిరంజన్ రెడ్డి మధ్యలో విభేదాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఒక ప్రకటన చేస్తూ క్లారిటీ ఇచ్చింది.. 'కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థకి, మాకు ఎలాంటి విభేదాలు లేవు.. ఇద్దరం ఏదైనా చర్చించుకునే, పూర్తి అంగీకారంతోనే నిర్ణయాలు తీసుకుంటున్నాం ' అని పేర్కొంది. చిరంజీవి 152 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు..
త్రిష అవుట్ కాజల్ ఇన్:
ఇక ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ ఫిక్స్ చేసినప్పటికీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.. కానీ తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి త్రిష వైదొలిగినట్లు స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు త్రిష స్థానంలో హీరోయిన్గా కాజల్ని తీసుకోవాలని అనుకుంటుందట చిత్రబృందం..ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. త్వరలోనే కాజల్ కూడా ఈ మూవీ షూటింగ్లో పాల్గొననుందని తెలుస్తోంది. గతంలో చిరు, కాజల్ కాంబినేషన్ లో 'ఖైదీ 150' అనే సినిమా తెరకెక్కింది.
A press release from our Producer Niranjan Reddy garu. #Chiru152 pic.twitter.com/BG7wxIqY7G
— MatineeEntertainment (@MatineeEnt) March 21, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire