దేవి జోరుకు మణిశర్మ బ్రేక్!

దేవి జోరుకు మణిశర్మ బ్రేక్!
x
Highlights

మెలోడీ బ్రహ్మా అని మణిశర్మకి మంచి పేరుంది. చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలకి అయన ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉండేవాడు.

మెలోడీ బ్రహ్మా అని మణిశర్మకి మంచి పేరుంది. చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలకి అయన ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉండేవాడు. అలాంటి మణిశర్మకి మెల్లమెల్లగా అవకాశాలు తగ్గుకుంటూ వచ్చాయి. కానీ గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి హిట్టు అయింది. ఇక ఇందులోని పాటలకి మంచి క్రేజ్ ఏర్పడింది. దీనితో మణిశర్మ మళ్ళీ కం బ్యాక్ అనిపించుకున్నాడు.

ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఇప్పుడు మణిశర్మ ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ ఫైటర్, రామ్ రెడ్ , చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి కూడా మణిశర్మనే సంగీతం అందిస్తున్నాడు. అయితే తాజాగా మహేష్ తర్వాత సినిమాకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడని టాక్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే క్రేజీ ప్రాజెక్ట్ కి మణిశర్మని ఫైనల్ చేసారని తెలుస్తుంది.

గతంలో మహేష్ - వంశీ కాంబినేషన్ లో వచ్చిన మహర్షి సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో తెలిసిందే.. ఈ సినిమాకి దేవి సంగీతం అందించాడు. ఇప్పుడు మహేష్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకి కూడా దేవినే సంగీతం అందిస్తున్నాడు. కానీ ఆ పాటల పైన బాగా ట్రోల్ అవుతుండటంతో నెక్స్ట్ వంశీ పైడిపల్లి తో చేయబోయే సినిమాకు దేవి ప్లేస్ లో మణిశర్మ ను తీసుకోవాలని మహేష్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. చివరగా మహేష్ కి ఖలేజా సినిమాని చేశాడు మణిశర్మ.. ఇక మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత మహేష్ - వంశీ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం మహేష్ చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 11న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ అజయ్ పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories