పేదవారికి సహాయం చేయడానికి మనోజ్ ముందడుగు

పేదవారికి సహాయం చేయడానికి మనోజ్ ముందడుగు
x
Manchu Manoj
Highlights

అయితే మాస్క్‌లు, శానిటైజర్ల పైన సరైన అవగాహన లేనివారికి తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు సినీ నటుడు మంచు మనోజ్..

కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే 140 దేశాలకు పైగా వ్యాపించిన ఈ వైరస్ ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తోంది. ఇక భారత్ లో మృతుల సంఖ్య మూడుకి చేరింది. 110 పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో దాని ప్రభావం ఎక్కువగా లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక ఈ వ్యాధి నివారణ కోసం కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాయి. అందులో భాగంగా ఆల్కహాలిక్ శానిటైజర్లు వాడాలని, ముఖానికి మాస్క్‌లు ధరించాలని చెబుతున్నాయి.

అయితే మాస్క్‌లు, శానిటైజర్ల పైన సరైన అవగాహన లేనివారికి తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు సినీ నటుడు మంచు మనోజ్.. వీటిని ఉచ్చితంగా పంపిణి చేస్తునట్టుగా మనోజ్ పేర్కొన్నాడు. అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని భద్రతగా ఉండాలని మనోజ్ ట్విట్టర్ వేదికగా కోరాడు. మనోజ్ చేస్తున్న ఈ పనికి అభిమానులు, నెటిజన్లు అందరూ సపోర్ట్ చేస్తూ అభినందిస్తున్నారు. రియల్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సమాజ సేవ చేయడంలో మనోజ్ ఎప్పుడు ముందు ఉంటూ వస్తున్నారు.

కొత్త సినిమా "అహం బ్రహ్మాస్మి"తో బిజీ

సినిమాలకి చాలా గ్యాప్ తీసుకున్న మనోజ్ ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి అనే సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎంఎం ఆర్ట్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి మనోజే సొంతంగా సినిమాని నిర్మిస్తున్నారు. మనోజ్ సరసన ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు , తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం బాషలలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories