పవన్ కళ్యాణ్ కి విలన్ గా నటిస్తారా అని అడిగా : అల్లు అరవింద్

allu aravind
x
allu aravind
Highlights

ఈ సినిమాని దాదాపుగా 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.. కేరళలోని ఓ ప్రాంతానికి చెందినా కథ ఆధారంగా ఈ సినిమా

తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి మెగాస్టార్ గా ఎదిగారు మమ్ముట్టి.. తాజాగా అయన నటిస్తున్నచిత్రం మమాంగం.. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ డిసెంబర్ 12 న విడుదల చేస్తుంది. తాజాగా సినిమాకి సంబధించిన ట్రైలర్ ని హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో మమ్ముట్టి, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అల్లు అరవింద్ హీరో మమ్ముట్టితో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. " స్వాతికిరణం సినిమాకి గాను మమ్ముట్టిని తీసుకున్నప్పుడు మలయాళం నటుడుని ఎందుకు తీసుకున్నారు. మలయాళం నటుడికి తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారా? అని అనుమానం కలిగింది. కానీ సినిమా చూసాక కనీసం నిలబడలేకపోయా .. అంత గొప్పగా నటించి మెప్పించారు మమ్మిట్టి.. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా కోసం విలన్ గా నటిస్తారా ని అడిగా.. దానికి అయన సమాధానం ఇస్తూ ఇదే విషయాన్నీ చిరంజీవిని అడుగుతరా అని ప్రశ్నించారు. దానికి నేను అడగలేనని అన్నా.. దానితో అయన నవ్వుతూ ఫోన్ పెట్టేశారంటూ " అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మమాంగం సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలనీ కోరినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు అల్లు అరవింద్.

ఈ సినిమాని దాదాపుగా 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.. కేరళలోని ఓ ప్రాంతానికి చెందినా కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి ఎం పద్మకుమార్ దర్శకత్వం వహించారు . మమ్ముట్టి చివరగా తెలుగులో యాత్ర అనే సినిమాలో నటించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories